ETV Bharat / state

'అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను ఏపీజీఈసీఎల్​కు అప్పగించండి' - ప్రభుత్వ భూములను వెంటనే ఏపీజీఇసీఎల్​కు అప్పగించండి

సోలార్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూమిని త్వరగా ఏపీ గ్రీన్ ఎనర్జీ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీజీఇసీఎల్)కు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా కలెక్టర్ పోల భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఈ విషయంపై సంబంధిత అధికారులతో ఆయన సమీక్షించారు.

land required for solar power projects
ప్రకాశం జిల్లాలో సోలార్ పవర్ ప్రాజెక్టు
author img

By

Published : May 25, 2021, 12:14 AM IST

ప్రకాశం జిల్లా దొనకొండ, సీఎస్​ పురం మండలాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో సాధించిన పురోగతిని అధికారులు కలెక్టరుకు వివరించారు. దొనకొండ మండలంలోని 2,576 ఎకరాలు, సీఎస్ పురం మండలంలో పెదగోగులపల్లి గ్రామంలో 3266.98 ఎకరాల భూమి కావాలని ఏపీజీఈసీఎల్ ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ఏపీజీఈసీఎల్​కు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని, పట్టా, అసైన్డ్ భూముల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ప్రకాశం జిల్లా దొనకొండ, సీఎస్​ పురం మండలాల్లో ఏర్పాటు చేయనున్న సోలార్ పవర్ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియపై సంబంధిత అధికారులతో కలెక్టర్ పోల భాస్కర్ సమీక్షించారు. ఈ సందర్భంగా భూ సేకరణలో సాధించిన పురోగతిని అధికారులు కలెక్టరుకు వివరించారు. దొనకొండ మండలంలోని 2,576 ఎకరాలు, సీఎస్ పురం మండలంలో పెదగోగులపల్లి గ్రామంలో 3266.98 ఎకరాల భూమి కావాలని ఏపీజీఈసీఎల్ ప్రతిపాదించినట్లు అధికారులు తెలిపారు.

అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూములను వెంటనే ఏపీజీఈసీఎల్​కు అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. ఆక్రమణలో ఉన్న ప్రభుత్వ భూములను విడిపించేందుకు చర్యలు తీసుకోవాలని, పట్టా, అసైన్డ్ భూముల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన సూచించారు.

ఇదీ చూడండి..

రేపు వైఎస్ఆర్ బీమా నగదు చెల్లింపు..

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.