కొరిసపాడు మండలం మేదరమెట్ల గ్రామానికి చెందిన విశాల డ్వాక్రా సంఘం సభ్యులు ఎంపీడీవో కార్యాలయంలో సూపరింటెండెంట్ ధనలక్ష్మిని కలిశారు. గ్రూప్ సభ్యుల సంతకాలు ఫోర్జరీ చేసి రుణం తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ అధికారికి వినతిపత్రం సమర్పించారు. గ్రామంలో పనిచేసే వీవోఏలు, వెలుగు సిబ్బంది చొరవతోనే ఈ రుణం పొందారని మహిళలు ఆరోపణలు చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు రావాల్సిన రుణం నగదు ఇప్పించాలని డ్వాక్రా మహిళలు కోరారు.
ఇదీ చదవండి :