ETV Bharat / state

ప్రకాశం జిల్లాలో రోడ్డెక్కిన ఆర్టీసీ బస్సులు

author img

By

Published : May 21, 2020, 11:22 AM IST

ప్రకాశం జిల్లాలో ఆర్టీసీ బస్సు సేవలను పునః ప్రారంభించారు. లాక్​డౌన్​ కారణంగా 2 నెలల తరువాత పరిమిత సంఖ్యలో సర్వీసులను అధికారులు ప్రారంభించారు. ఆర్టీసీ సిబ్బంది శానిటైజర్లతో చేతులు శుభ్రపరచి ప్రయాణికులను బస్సులు ఎక్కించారు.

apstrtc buses started in prakasam district
ఆర్టీసీ బస్సులు పునఃప్రారంభం

ప్రకాశం జిల్లాలో పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో 152 సర్వీసులను ప్రారంభించారు. ప్రధాన పట్టణాలైన విజయవాడ, గుంటూరుతో పాటు, జిల్లాలో ఉన్న పట్టణాలు, కొన్ని గ్రామీణ సర్వీసులు ప్రారంభించారు. పరిమిత స్టాపులతో పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. బస్సులో కండక్టర్ లేకుండా, ఆన్​లైన్‌లో లేక బస్టాండ్‌ వద్ద గానీ టికెట్లు తీసుకొని బస్సులు ఎక్కిస్తున్నారు.

భౌతిక దూరం పాటించే విధంగా సీట్ల మధ్య అంతరాన్ని ఉంచారు. ప్రయాణికులు మాస్కులు ధరించి బస్సులు ఎక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు డిపో నుంచి ప్రారంభించిన 27 సర్వీసులకు మంచి స్పందన ఉందని డిపో అధికారులు తెలిపారు. ఆన్​లైన్‌లోనే ఎక్కువ టికెట్లు అమ్ముడవుతున్నాయని డిపో మేనేజర్‌ జి. శ్రీనినవాసరావు చెప్పారు.

ప్రకాశం జిల్లాలో పరిమిత సంఖ్యలో ఆర్టీసీ బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఉన్న 8 డిపోల్లో 152 సర్వీసులను ప్రారంభించారు. ప్రధాన పట్టణాలైన విజయవాడ, గుంటూరుతో పాటు, జిల్లాలో ఉన్న పట్టణాలు, కొన్ని గ్రామీణ సర్వీసులు ప్రారంభించారు. పరిమిత స్టాపులతో పల్లెవెలుగు బస్సులు నడుస్తున్నాయి. బస్సులో కండక్టర్ లేకుండా, ఆన్​లైన్‌లో లేక బస్టాండ్‌ వద్ద గానీ టికెట్లు తీసుకొని బస్సులు ఎక్కిస్తున్నారు.

భౌతిక దూరం పాటించే విధంగా సీట్ల మధ్య అంతరాన్ని ఉంచారు. ప్రయాణికులు మాస్కులు ధరించి బస్సులు ఎక్కేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఒంగోలు డిపో నుంచి ప్రారంభించిన 27 సర్వీసులకు మంచి స్పందన ఉందని డిపో అధికారులు తెలిపారు. ఆన్​లైన్‌లోనే ఎక్కువ టికెట్లు అమ్ముడవుతున్నాయని డిపో మేనేజర్‌ జి. శ్రీనినవాసరావు చెప్పారు.

ఇదీ చదవండి:

సుదీర్ఘ లాక్‌డౌన్‌ తర్వాత రోడ్లపైకి ఆర్టీసీ బస్సులు

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.