ETV Bharat / state

సచివాలయంలో ఏఎన్​ఎంకు కరోనా పాజిటివ్​

author img

By

Published : Jun 13, 2020, 12:05 AM IST

Updated : Jun 13, 2020, 7:02 AM IST

నాగరాజుపల్లి గ్రామ సచివాలయంలోని ఏఎన్​ఎంకు పరీక్షలు నిర్వహించగా కరోనా పాజిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ ఉద్యోగితో ఉన్న మరో 15 మందిని ఇంకొల్లులోని క్వారంటైన్​ కేంద్రాలకు తరలించారు. ఎఎన్​ఎం చిలకలూరుపేట నుంచి వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. గ్రామ శివారులో చెక్​పోస్ట్​ను ఏర్పాటు చేశారు. ప్రజలెవ్వరూ గ్రామానికి వెళ్లకుండా పోలీసులు నియంత్రించారు.

anm got corona positive in nagarajupalli sachivalayam in prakasam district
ఏఎన్​ఎంకు కరోనా పాజిటివ్​

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తకు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాటిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. సదరు ఎఎన్​ఎం ప్రతిరోజు చిలకలూరుపేట నుంచి విధులకు హాజరవుతున్నారు. ఇటీవలే ఆమె నివాసముండే ప్రదేశానికి సమీపంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఎఎన్​ఎంను వైద్యాధికారులు గత 14 రోజులుగా హోమ్​ క్వారంటైన్​లో ఉంచారు. సదరు మహిళా ఉద్యోగికి చేసిన పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల గురువారం యథావిథిగా విధులకు హాజరయ్యారు.

ఇదీ చదవండి :

ప్రకాశం జిల్లా మార్టూరు మండలం నాగరాజుపల్లి గ్రామ సచివాలయంలో పనిచేస్తున్న ఆరోగ్య కార్యకర్తకు కరోనా పరీక్షలు నిర్వహించగా... పాటిటివ్​గా నిర్ధారణ అయ్యింది. దీంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయ్యింది. సదరు ఎఎన్​ఎం ప్రతిరోజు చిలకలూరుపేట నుంచి విధులకు హాజరవుతున్నారు. ఇటీవలే ఆమె నివాసముండే ప్రదేశానికి సమీపంలో కరోనా పాజిటివ్​ కేసు నమోదైంది. ఈ సందర్భంగా ఎఎన్​ఎంను వైద్యాధికారులు గత 14 రోజులుగా హోమ్​ క్వారంటైన్​లో ఉంచారు. సదరు మహిళా ఉద్యోగికి చేసిన పరీక్షా ఫలితాలు ఆలస్యంగా రావడం వల్ల గురువారం యథావిథిగా విధులకు హాజరయ్యారు.

ఇదీ చదవండి :

రేపటి నుంచి రెడ్​జోన్​గా అయినవిల్లి మండలం

Last Updated : Jun 13, 2020, 7:02 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.