ETV Bharat / state

Anandayya Medicine: రేపు ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ : ఎంపీ మాగుంట

author img

By

Published : Jun 9, 2021, 9:59 PM IST

ఒంగోలులోని పీవీఆర్ మున్సిపల్ బాలుర హై స్కూలు మైదానంలో ఆనందయ్య మందు పంపిణీకి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ మేరకు గురువారం ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు యువ పారిశ్రామిక వేత్త రాఘవరెడ్డి ఆధ్వర్యంలో ప్రక్రియను ప్రారంభించనున్నారు.

Anandayya Medicine: రేపు ఉదయం 9 గంటలకు ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ : ఎంపీ మాగుంట
Anandayya Medicine: రేపు ఉదయం 9 గంటలకు ఒంగోలులో ఆనందయ్య మందు పంపిణీ : ఎంపీ మాగుంట

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర హై స్కూలు ఆవరణలో ఆనందయ్య 'పీ' రకం మందును నగర ప్రజలకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు యువ పారిశ్రామిక వేత్త రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు మందు కోసం రావొద్దని నిర్వహకులు సూచించారు. గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మున్సిపల్ మైదానంలో పంపిణీ చేయనున్నారు.

కొవిడ్ లేని వారికి మాత్రమే..
ఆనందయ్య ఔషధం పరిమిత స్థాయిలోనే సరఫరా చేస్తున్నందన ప్రస్తుతం ఒంగోలు నగర వాసుల్లో కొవిడ్ బారిన పడని వారికి అడ్వాన్స్​డ్ మందును మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారు మందు కోసం రాకూడదని స్పష్టం చేశారు.

ముందస్తుగానే సమాచారం ఇస్తాం..

ఆనందయ్య మందును పంపిణీ చేసే ముందు రోజు పత్రికా ముఖంగా ప్రజలకు సమాచారం ముందుస్తుగానే అందిస్తామని ఆనందయ్య ప్రతినిధులు వివరించారు. తదుపరి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా అసెంబ్లీల పరిధిలో ఉండే ప్రజలకు సైతం ఆనందయ్య మందు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

ఇవీ చూడండి : Jagan Delhi Tour: దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ

ప్రకాశం జిల్లాలోని ఒంగోలు పీవీఆర్ మున్సిపల్ బాలుర హై స్కూలు ఆవరణలో ఆనందయ్య 'పీ' రకం మందును నగర ప్రజలకు మాత్రమే పంపిణీ చేయనున్నారు. ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి, ఆయన తనయుడు యువ పారిశ్రామిక వేత్త రాఘవరెడ్డి ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఇతర ప్రాంతాల ప్రజలు మందు కోసం రావొద్దని నిర్వహకులు సూచించారు. గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.00 గంటల వరకు మున్సిపల్ మైదానంలో పంపిణీ చేయనున్నారు.

కొవిడ్ లేని వారికి మాత్రమే..
ఆనందయ్య ఔషధం పరిమిత స్థాయిలోనే సరఫరా చేస్తున్నందన ప్రస్తుతం ఒంగోలు నగర వాసుల్లో కొవిడ్ బారిన పడని వారికి అడ్వాన్స్​డ్ మందును మాత్రమే పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. ఫలితంగా కరోనా బారిన పడిన వారు మందు కోసం రాకూడదని స్పష్టం చేశారు.

ముందస్తుగానే సమాచారం ఇస్తాం..

ఆనందయ్య మందును పంపిణీ చేసే ముందు రోజు పత్రికా ముఖంగా ప్రజలకు సమాచారం ముందుస్తుగానే అందిస్తామని ఆనందయ్య ప్రతినిధులు వివరించారు. తదుపరి ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని మిగతా అసెంబ్లీల పరిధిలో ఉండే ప్రజలకు సైతం ఆనందయ్య మందు ఉచితంగా పంపిణీ చేస్తామన్నారు.

ఇవీ చూడండి : Jagan Delhi Tour: దిల్లీకి సీఎం జగన్.. అమిత్​ షాతో భేటీ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.