ETV Bharat / state

పింఛన్ కోసం ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

author img

By

Published : Dec 30, 2020, 1:18 PM IST

పింఛన్ అందటం లేదంటూ... ఓ దివ్యాంగురాలు ఆర్డీఓ కార్యాలయం ఎదుట కుటుంబంతో సహా ధర్నా చేపట్టింది. బోదకాలుతో బాధపడుతున్న తాను... 10 ఏళ్లుగా కార్యలయాల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోవటం లేదని వాపోతున్నారు.

handicaped women family protest
పింఛన్ అందించాలని వేడుకుంటూ ఆర్డీఓ కార్యాలయం ఎదుట నిరసన

పింఛన్ అందటం లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా చేపట్టింది. తర్లుపాడు మండలం తుమ్మలచేరువు గ్రామానికి జమినాబి అనే దివ్యాంగురాలు.. పింఛన్ కోసం... 10 ఏళ్లుగా కార్యలయాల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపింది.

అయినా.. అధికారులు కనికరించడం లేదని ఆవేదన చెందింది. విసుగు చెంది కుటుంబంతో సహా నిరసనకు దిగినట్టు తెలిపింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. భాజాపా నాయకుడు పీవీ కృష్ణారావు ఆ కుటుంబానికి మద్దతుగా బైఠాయించారు.

పింఛన్ అందటం లేదని ప్రకాశం జిల్లా మార్కాపురం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఓ కుటుంబం ధర్నా చేపట్టింది. తర్లుపాడు మండలం తుమ్మలచేరువు గ్రామానికి జమినాబి అనే దివ్యాంగురాలు.. పింఛన్ కోసం... 10 ఏళ్లుగా కార్యలయాల చుట్టూ తిరుగుతున్నట్టు తెలిపింది.

అయినా.. అధికారులు కనికరించడం లేదని ఆవేదన చెందింది. విసుగు చెంది కుటుంబంతో సహా నిరసనకు దిగినట్టు తెలిపింది. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ఆ కుటుంబం వేడుకుంటోంది. భాజాపా నాయకుడు పీవీ కృష్ణారావు ఆ కుటుంబానికి మద్దతుగా బైఠాయించారు.

ఇదీ చదవండి:

శాసనసభ, శాసనమండలి ప్రోరోగ్.. ఉత్తర్వులు జారీ చేసిన గవర్నర్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.