ETV Bharat / state

బావిలో గల్లంతైన యువతి మృతి

author img

By

Published : Feb 8, 2021, 9:32 AM IST

చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లె ఆది ఆంధ్రవాడ సమీపంలో వ్యవసాయ బావిలో పడిన యువతి మృతి చెందింది. మృతదేహాన్ని రెస్క్యూ టీం సిబ్బంది వెలికితీశారు.

young woman lost her way in a well and died
బావిలో గల్లంతైన యువతి మృతి

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లె ఆది ఆంధ్రవాడ సమీపంలో వ్యవసాయ బావిలో గల్లంతైన యువతి మృతదేహాన్ని ఎట్టకేలకు రెస్క్యూ టీం సిబ్బంది వెలికితీశారు. గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె కృష్ణవేణి ప్రమాదవశాత్తూ బావిలో జారిపడింది. ఈత రాకపోవటంతో మునిగిపోయింది.

ఏఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. నగరి అగ్నిమాపకశాఖధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బావిలోని నీటిని తొలగించారు. బురదలో కూరుకుపోయిన యువతి మృతదేహాన్ని వెలికితీసి.. పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసీ మార్గదర్శకాలు

చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లె ఆది ఆంధ్రవాడ సమీపంలో వ్యవసాయ బావిలో గల్లంతైన యువతి మృతదేహాన్ని ఎట్టకేలకు రెస్క్యూ టీం సిబ్బంది వెలికితీశారు. గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె కృష్ణవేణి ప్రమాదవశాత్తూ బావిలో జారిపడింది. ఈత రాకపోవటంతో మునిగిపోయింది.

ఏఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. నగరి అగ్నిమాపకశాఖధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బావిలోని నీటిని తొలగించారు. బురదలో కూరుకుపోయిన యువతి మృతదేహాన్ని వెలికితీసి.. పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

ఇదీ చదవండి: ఉద్యోగుల రక్షణకు ఎస్ఈసీ మార్గదర్శకాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.