చిత్తూరు జిల్లా వెదురుకుప్పం మండలం బ్రహ్మణపల్లె ఆది ఆంధ్రవాడ సమీపంలో వ్యవసాయ బావిలో గల్లంతైన యువతి మృతదేహాన్ని ఎట్టకేలకు రెస్క్యూ టీం సిబ్బంది వెలికితీశారు. గ్రామానికి చెందిన రమేష్ కుమార్తె కృష్ణవేణి ప్రమాదవశాత్తూ బావిలో జారిపడింది. ఈత రాకపోవటంతో మునిగిపోయింది.
ఏఎస్సై శివప్రసాద్ సిబ్బందితో కలిసి గాలింపు చేపట్టినా ఆచూకీ దొరకలేదు. నగరి అగ్నిమాపకశాఖధికారి సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో బావిలోని నీటిని తొలగించారు. బురదలో కూరుకుపోయిన యువతి మృతదేహాన్ని వెలికితీసి.. పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.