కొంత కాలంగా వాయిదా పడుతూ వస్తున్న విక్రమ సింహపురి విశ్వ విద్యాలయ స్నాతకోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం యూనివర్సిటీలో స్నాతకోత్సవం జరగనుంది. 2, 3, 4, 5వ స్నాతకోత్సవాలు నెల్లూరు నగరంలోని కస్తూరిభా కళాక్షేత్రంలో ప్రారంభించనున్నారు. ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు, గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్తోపాటు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 730 మంది విద్యార్థులు పాల్గొనేందుకు అనుమతి పొందారు. పలువురు విద్యార్థులకు ఉపరాష్ట్రపతి పీహెచ్డీ పట్టాలు, బంగారు పతకాలు ప్రదానం చేయనున్నారు.
ఇదీ చదవండి: