నెల్లూరు జిల్లా రాపూరు అటవీ ప్రాంతంలో పూడ్చిపెట్టిన బెంగళూరుకు చెందిన సిద్ధార్థ దేవేందర్ మృతదేహాన్ని బెంగుళూరు, నెల్లూరు జిల్లా పోలీసులు వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. హత్యకేసు నిందితుల్లో ఇద్దరు ఆత్మహత్యకు ప్రయత్నించగా, వారిలో ఒకరు మృతి చెందారు. మృతదేహాన్ని చూసిన సిద్ధార్థ తండ్రి కన్నీరుమున్నీరుగా విలపించారు.
మరొకరు తీవ్ర గాయాతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. వీరిద్దరూ తిరుపతి వాసులే కావడంతో ఈ కేసు మరింత సంచలనంగా మారింది. ఆర్థిక లావాదేవిల్లో భాగంగానే హత్యచేసినట్లు పోలీసులు తెలిపారు. హత్య కేసుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి: కర్ణాటకలో హత్య.. రాపూరు అడవుల్లో మృతదేహం