ప్రభుత్వాలు మారుతున్నాయే కానీ... రైతుల బాధను పట్టించుకున్న నాథుడు లేడని రైతు నాయకులు ఆరోపిస్తున్నారు. వంతెన తెగిపోయిన ప్రతిసారి... తాత్కాలిక మరమ్మతులు చేయడం తప్ప, పెన్నా బ్యారేజీ పనులు పూర్తి చేయడం లేదన్నారు. జిల్లాలో చాలాచోట్ల ఇదివరకే నాట్ల ప్రక్రియ కొనసాగుతోందని... ఈ సమయంలో పంటకు సమృద్ధిగా సాగు నీరందకుంటే రైతులు నష్టపోతారని వారు చెబుతున్నారు.
ఇప్పటికే పెన్నా బ్యారేజీ నిర్మాణ పనులు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకున్నామని... పెన్నా బ్యారేజీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ విజయ్ కుమార్ రెడ్డి తెలిపారు. గత నెలలోకురిసిన వర్షాలకు బ్యారేజీ కింద ఉన్న వంతెన దెబ్బతిందని... ఎట్టి పరిస్థితుల్లో వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నాటికి బ్యారేజీ పనులు పూర్తిచేసి రైతులకు సమృద్ధిగా నీరందిస్తామని ఆయన తెలిపారు.
అధిక వర్షాల వల్ల జలాశయాలు, చెరువులు, కుంటలు నిండుకుండను తలపిస్తుంటే తమకు మాత్రం సాగునీటి ఇక్కట్లు తప్పడం లేదని.... అధికారులు స్పందించి పెన్నా బ్యారేజీ నిర్మాణం పూర్తి చేయాలని రైతులు కోరుతున్నారు.
ఇవీ చదవండి