భారీ వర్షంతో వరి పంట నేల వాలింది. అన్నదాతల ఆశలపై అకాల వర్షం నీళ్లు చల్లింది. వారం పది రోజుల్లో దిగుబడి చేతికందే దశలో వర్షం కృషీవలుడు కంట కన్నీరు కారేలా చేసింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దొరవారిసత్రం మండలంలో కల్లూరు, శ్రీ ధనమల్లి, పూలతోట, మేళనాలత్తూరు తదితర గ్రామాల్లో 10వేల ఎకరాల విస్తీర్ణంలో బీపీటీ, ఆర్ఎన్ఆర్ రకాల వరి సాగు చేస్తున్నారు. అంతా ఎన్ను దశలో ఉంది. నూర్పిడిలు చేసేందుకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో వర్షం తీవ్రంగా నష్టపోయేలా చేసింది. ఇదే విధంగా ఒకటి రెండు రోజులు వర్షం కురిస్తే పంట మొత్తం దెబ్బతింటుంది. అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ చదవండి: