ETV Bharat / state

'నిర్మించిన 4 నెలలకే అధ్వానంగా మారిన రహదారి'

author img

By

Published : Nov 23, 2019, 4:24 PM IST

నాలుగు నెలల కిందట రూ.కోటి 70 లక్షల వ్యయంతో రహదారి నిర్మించారు. ఎన్నో ఏళ్ల తర్వాత రోడ్డు వెయ్యటంతో ఆ రెండు గ్రామాల ప్రజలు ఆనందపడ్డారు. కానీ ఆ సంతోషం ఎంతో కాలం నిలవలేదు. రహదారి నిర్మించిన 4 నెలలకే రోడ్డు అధ్వానంగా మారింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు, బసవరాజు పాలెంగ్రామాల రహదారి పరిస్థితి ఇది.

new road dameges in nellore district
'నిర్మించిన 4 నెలలకే అధ్వానంగా మారిన రహదారి'

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు-బసవరాజుపాలెం గ్రామాలకు వేసిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సుమారు రూ.కోటి 70 లక్షల వ్యయంతో 4 నెలల కిందట మహిమలూరు నుంచి బసవరాజుపాలెం వరకు రోడ్డు వేశారు. అప్పుడే రోడ్డు మొత్తం కంకరు తేలుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. పనులు చేసే సమయంలో గుత్తేదారులను ప్రశ్నించినా... తమ మాటను లెక్క చెయ్యలేదని ఆరోపించారు.

కనీస నియమాలు పాటించకుండా... తమలపాకు మందమైన తారు వెయ్యలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామానికి సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడ్డామని... ఇప్పుడు వేసిన రోడ్డు ఇలా 4 నెలలకే దెబ్బతినడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: అధ్వానంగా విజయవాడ-రాజమహేంద్రవరం జాతీయ రహదారి

'నిర్మించిన 4 నెలలకే అధ్వానంగా మారిన రహదారి'

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు-బసవరాజుపాలెం గ్రామాలకు వేసిన రోడ్డు మూన్నాళ్ల ముచ్చటగా మారింది. సుమారు రూ.కోటి 70 లక్షల వ్యయంతో 4 నెలల కిందట మహిమలూరు నుంచి బసవరాజుపాలెం వరకు రోడ్డు వేశారు. అప్పుడే రోడ్డు మొత్తం కంకరు తేలుతోందని గ్రామస్థులు వాపోతున్నారు. పనులు చేసే సమయంలో గుత్తేదారులను ప్రశ్నించినా... తమ మాటను లెక్క చెయ్యలేదని ఆరోపించారు.

కనీస నియమాలు పాటించకుండా... తమలపాకు మందమైన తారు వెయ్యలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గ్రామానికి సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడ్డామని... ఇప్పుడు వేసిన రోడ్డు ఇలా 4 నెలలకే దెబ్బతినడం ఏంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మతులు చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చూడండి: అధ్వానంగా విజయవాడ-రాజమహేంద్రవరం జాతీయ రహదారి

Intro:Ap_nlr_11_23_road damege_avbbbb_AP10061


Body:మున్నాల ముచ్చటగా తయారైంది మహిమలూరు నుండి బసవరాజు పాలెం వరకు సుమారు ఒక కోటి 70 లక్షల రూపాయల వ్యయంతో వేసిన రోడ్డు పనులు వేసిన మూడు నెలలకే కంకర లేచిపోయి అధ్వానంగా తయారైంది ఈ రోడ్డు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం మహిమలూరు గ్రామం నుండి ఇ బసవరాజు పాలెం గ్రామం వరకు ఎన్నో సంవత్సరాల నుండి రోడ్డు సరిగాలేక నాన ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఇటీవల మూడు నెలల క్రితం సుమారు కోటి 70 లక్షల వ్యయంతో సుమారు ఒకటిన్నర కిలోమీటర్లు మేర అ రోడ్డు వేశారు పనులు దక్కించుకున్న గుత్తేదారులు వేసిన మూడు నెలలకే రోడ్డు మొత్తం పిచ్చోడి పోయి కంకరు బయట పడుతుంది పనులు చేసే సమయంలో ఇంత నాసిరకంగా పనులు చేస్తున్నారు ఏమిటని గ్రామస్తులు ప్రశ్నించిన వారి మాటను లెక్క చేయలేదు సదరు కాంట్రాక్టర్ రోడ్డు వేసేటప్పుడు పాటించాల్సిన నియమాలు పాటించకుండా తమలపాకు మందం కూడా తారు వేయలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు ఎన్నో సంవత్సరాల నుండి గ్రామానికి సరైన రహదారులు లేక నానా ఇబ్బందులు పడ్డామని ఇప్పుడు వేసిన రోడ్డు కూడా ఇలా మూడు నెలలకే దెబ్బతినడం ఏమిటని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు ఇకనైనా అధికారులు స్పందించి రోడ్డు మరమ్మత్తులు ఆ గ్రామ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు సదరు కాంట్రాక్టర్ రోడ్డు పనులు అంతమాత్రాన వేస్తే ఇటీవల పొలం పనులకు వెళ్లే రైతులు ట్రాక్టర్ లకు కేజీలు కట్టుకొని పొలం పనులకు వెళ్లడం వల్ల ఇంకాస్తా రోడ్డు దెబ్బతింటుందని గ్రామస్తులు అంటున్నారు


Conclusion:కిట్ నెంబర 698 నెల్లూరు జిల్లా ఆత్మకూరు phone 9866307533

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.