ETV Bharat / state

కళాశాల భవనాలకు ఎమ్మెల్యే ఆనం శంకుస్థాపన

author img

By

Published : Feb 5, 2020, 6:50 PM IST

నెల్లూరు జిల్లా వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామం లో క‌స్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలలో అదనపు గదులను ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి శంకుస్థాపన చేశారు.మెుదటి విడత నాడు-నేడు పథకంపై సమీక్ష నిర్వహించారు.

nadu nedu first meeting in nellore
మనబడి నాడు - నేడు పై సమీక్ష
మనబడి నాడు - నేడు పై సమీక్ష

నెల్లూరు జిల్లాలో మొదటి విడత నాడు-నేడు పథకంలో రూ 192 కోట్లతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఆధునిక హంగులు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామంలోని క‌స్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలకు కోటి పది లక్షల అంచనాలతో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్న విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థినుల వృత్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలో 150 ఒక పాఠశాలలకు 24 కోట్ల 57 లక్షల తో నాడు నేడు మాబడి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్​ప్రెస్ ఇంజన్

మనబడి నాడు - నేడు పై సమీక్ష

నెల్లూరు జిల్లాలో మొదటి విడత నాడు-నేడు పథకంలో రూ 192 కోట్లతో ప్రాథమిక ఉన్నత పాఠశాలలకు ఆధునిక హంగులు చేకూర్చడానికి చర్యలు తీసుకుంటున్నట్లు వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. ఈ మేరకు వెంకటగిరి మండలం వల్లివేడు గ్రామంలోని క‌స్తూర్భ గాంధీ బాలికల జూనియర్ కళాశాలకు కోటి పది లక్షల అంచనాలతో అదనపు గదుల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రస్థాయిలో సైన్స్ ప్రదర్శనలో ప్రతిభ చాటుకున్న విద్యార్థిని ఎమ్మెల్యే అభినందించారు. విద్యార్థినుల వృత్తి ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. నియోజకవర్గంలో 150 ఒక పాఠశాలలకు 24 కోట్ల 57 లక్షల తో నాడు నేడు మాబడి పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

ఇదీ చూడండి:పట్టాలు తప్పిన సింహపురి ఎక్స్​ప్రెస్ ఇంజన్

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.