వలస కార్మికులతో నెల్లూరు జిల్లా నుంచి బీహార్కు మరో రైలు బయలుదేరింది. జిల్లా ఆర్డీవో హుస్సేన్ సాహెబ్, డీఎస్పీ పచ్చజెండా ఊపి రైలును ప్రారంభించారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పనిచేస్తున్న 1,141 మంది వలస కార్మికులను నెల్లూరు రైల్వే స్టేషన్ నుంచి శ్రామిక్ రైలులో బీహార్కు పంపించారు.
వీరందరూ బీహార్లోని మోతిహారి రైల్వేస్టేషన్కు చేరుకోనున్నారు. జిల్లా నుంచి 4 రోజుల క్రితం ఓ రైలు బీహార్కు వెళ్లగా, అధికారులు రెండో రైలును పంపించారు. స్వగ్రామాలకు బయలుదేరిన వలస కార్మికులు ఆనందం వ్యక్తం చేశారు. ఇన్నాళ్లూ వసతులు కల్పించిన ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఇదీ చదవండి: