ETV Bharat / state

తెలుగు భాష సాహిత్య పరిరక్షణ... అందరి బాధ్యత - నెల్లూరులో శాసన మండలి ఛైర్మన్

నెల్లూరు జిల్లాలో శాసన మండలి ఛైర్మన్​ షరీఫ్ పర్యటించారు. ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, ఇతర తెదేపా నేతలు ఘన స్వాగతం పలికారు. తెలుగు భాష సాహిత్యాన్ని పరిరక్షించేందుకు కృషి చేయాల్సిన అవసరముందని షరీఫ్ అన్నారు.

mandali chirman
తెలుగు భాష సాహిత్య పరిరక్షణ
author img

By

Published : Dec 30, 2020, 7:18 AM IST

నెల్లూరు జిల్లా తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన శాసన మండలి ఛైర్మన్ షరీఫ్​కు... ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, తెదేపా నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్​ స్వాగతం పలికారు. ఆరు వందల ఏళ్ల నాటి తెలుగు సాహిత్యానికి చెందిన ప్రాచీన గ్రంథాలు తంజావూరులో పరిరక్షిస్తున్నారని షరీఫ్ అన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో, బెంగళూరులో ఉన్న తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ అధ్యయన కేంద్రాన్ని శాసనమండలి కమిటీ సందర్శించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

నెల్లూరు జిల్లా తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని సందర్శించేందుకు వచ్చిన శాసన మండలి ఛైర్మన్ షరీఫ్​కు... ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర, తెదేపా నెల్లూరు పార్లమెంటు అధ్యక్షులు అబ్దుల్ అజీజ్​ స్వాగతం పలికారు. ఆరు వందల ఏళ్ల నాటి తెలుగు సాహిత్యానికి చెందిన ప్రాచీన గ్రంథాలు తంజావూరులో పరిరక్షిస్తున్నారని షరీఫ్ అన్నారు.

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కృషితో, బెంగళూరులో ఉన్న తెలుగు ప్రాచీన విశిష్ట అధ్యయన కేంద్రాన్ని నెల్లూరులో ఏర్పాటు చేసినట్లు గుర్తుచేశారు. ఈ అధ్యయన కేంద్రాన్ని శాసనమండలి కమిటీ సందర్శించి, తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వానికి నివేదిక సమర్పిస్తామన్నారు.

ఇదీ చదవండి:

'కొత్త రకం వైరస్ గురించి సామాజిక మాధ్యమాల్లో వస్తున్న ప్రచారమంతా అవాస్తవం'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.