ETV Bharat / state

గ్రామ వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

వెంకటగిరిలో శిక్షణ పొందిన గ్రామ వాలంటీర్లకు ఎమ్మెల్యే ఆనం రామనారయణరెడ్డి నియామక పత్రాలు అందజేశారు.

author img

By

Published : Aug 8, 2019, 11:53 PM IST

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత
వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను నియమించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శిక్షణ పొందిన గ్రామవాలంటీర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో వాలంటీర్లు చేయాల్సిన పనులను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్సాహవంతులతో పాటలు పాడించారు. వెంకటగిరి నియోజకవర్గంలో 1565 మందిని వాలంటీర్లుగా నియమించగా... కలువాయి, రాపూరు, దక్కిలి, వెంకటగిరి మండల కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇది చూడండి: భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తలారా! జాగ్రత్త!

వాలంటీర్లకు నియామక పత్రాలు అందజేత

ప్రజలకు ప్రభుత్వ పథకాలు పారదర్శకంగా అందించేందుకే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లను నియమించారని ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి తెలిపారు. నెల్లూరు జిల్లా వెంకటగిరిలో శిక్షణ పొందిన గ్రామవాలంటీర్లకు ఆయన నియామక పత్రాలు అందజేశారు. భవిష్యత్తులో వాలంటీర్లు చేయాల్సిన పనులను వారిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఉత్సాహవంతులతో పాటలు పాడించారు. వెంకటగిరి నియోజకవర్గంలో 1565 మందిని వాలంటీర్లుగా నియమించగా... కలువాయి, రాపూరు, దక్కిలి, వెంకటగిరి మండల కేంద్రాల్లో ధ్రువీకరణ పత్రాలను అందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

ఇది చూడండి: భార్యలను వేధించి విదేశాలకు వెళ్లే...భర్తలారా! జాగ్రత్త!

Intro:Ap_tpt_51_08_mla_programme_avb_ap10105

సమస్యలన్నీ పరిష్కరిస్తా నాకు కాస్త సమయం ఇవ్వండి
* పలమనేరు నియోజకవర్గ ఎమ్మెల్యే వెంకటే గౌడBody:నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలన్నింటిని పరిష్కారించేందుకు చర్యలు తీసుకుంటానని..అయితే తనకు కాస్త సమయం ఇవ్వాల్సిందిగా చిత్తూరు జిల్లా పలమనేరు నియోజకవర్గ శాసనసభ్యుడు వెంకటేగౌడ చెప్పారు. నియోజకవర్గంలో గత అయిదు రోజులుగా జరుగుతున్న మనఊరు-మన ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా గురువారం పలమనేరు గ్రామీణ మండలంలోని బయ్యప్పగారిపల్లి, కరిడిమడుగు, కొలమాసనపల్లి, మొరం పంచాయతీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామ పంచాయతీలలో ప్రజల సమస్యలను ఎమ్మెల్యే వద్ద ప్రస్తావించగా అన్ని సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని అయితే తనకు కొంత సమయం ఇవ్వాలని ఆయన చెప్పారు. అనంతరం గత ప్రభుత్వ వైఫల్యాలు ప్రస్తుత ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి పథకాలు పనుల గురించి వివరించారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ముందుకెళ్తున్నారని చెప్పారు. అలాగే పలు గ్రామాలలో పాఠశాల విద్యార్థులకు ఏకరూప దుస్తులు అందించి జాతీయ నులిపురుగుల నివారణ దినం సందర్భంగా పాఠశాల పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు అందించారు. కార్యక్రమంలో పలమనేరు మండలం స్థాయి అధికారులు, పలువురు వైకాపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.Conclusion:రోషన్
ఈటీవీ భారత్
పలమనేరు
7993300491
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.