ETV Bharat / state

పడుకున్న వ్యక్తిని నిద్రలేపి బంగారం లాక్కెళ్లారు... - gang robbery gold from women in atmakuru

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని ఓ ఇంటి బయట నిద్రిస్తున్న మహిళను నిద్ర లేపి కళ్లల్లో కారం చల్లి బంగారాన్ని ఎత్తుకెళ్లారు.

కళ్లల్లో కారం చల్లి బంగారాన్ని ఎత్తుకెళ్లారు
author img

By

Published : Oct 21, 2019, 8:43 PM IST

Updated : Oct 28, 2019, 8:28 AM IST

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని జెఆర్​పేట ప్రాంతంలో మూడో అంతస్తులో ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి మెడలోని బంగారం దోచుకెళ్లారు. రత్నమ్మ తన కుమార్తె, మనవరాళ్లతో కలిసి నివసిస్తుంది. తనను పట్టుకున్న తీరును బట్టి వచ్చిన దొంగలో ఒకరు మహిళగా ఆమె గుర్తించారు. ఎత్తుకెళ్లిన బంగారు నగ 6 సవర్లు (సుమారు 5 తులాలు ) ఉందని చెప్పింది. వాటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొంది. ఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. ఆత్మకూరు డివిజన్​ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నా పోలీసు నిఘా సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కళ్లల్లో కారం చల్లి బంగారాన్ని ఎత్తుకెళ్లారు

నెల్లూరు జిల్లా ఆత్మకూరు పరిధిలోని జెఆర్​పేట ప్రాంతంలో మూడో అంతస్తులో ఆరుబయట నిద్రిస్తున్న మహిళపై గుర్తు తెలియని వ్యక్తులు కళ్లల్లో కారం చల్లి మెడలోని బంగారం దోచుకెళ్లారు. రత్నమ్మ తన కుమార్తె, మనవరాళ్లతో కలిసి నివసిస్తుంది. తనను పట్టుకున్న తీరును బట్టి వచ్చిన దొంగలో ఒకరు మహిళగా ఆమె గుర్తించారు. ఎత్తుకెళ్లిన బంగారు నగ 6 సవర్లు (సుమారు 5 తులాలు ) ఉందని చెప్పింది. వాటి విలువ సుమారు రూ. 2 లక్షలు ఉంటుందని పేర్కొంది. ఘటన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించారు. ఆత్మకూరు డివిజన్​ ప్రాంతంలో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నా పోలీసు నిఘా సరిగా లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు.

కళ్లల్లో కారం చల్లి బంగారాన్ని ఎత్తుకెళ్లారు

ఇదీ చదవండి :

'పూజల పేరుతో మహిళ మెడలో గొలుసు చోరీ'

Intro:కారం చల్లి బంగారు అపహరణBody:కళ్లల్లో కారం చల్లి దొంగతనం
( నెల్లూరు జిల్లా.. ఆత్మకూరు) ఇంటి వద్ద ఆరుబయట నిద్రిస్తున్న ఓ మహిళ ను నిద్ర లేపి కళ్లల్లో కారం చల్లి బంగారు నగ ఎత్తుకెళ్లిన సంఘటన ఇది....
బాధితురాలు రత్నమ్మ చెప్పిన వివరాల ప్రకారం
నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం నాలుగో వార్డు పరిధిలోని జె ఆర్ పేట ప్రాంతంలో ఓ భవనంలోని మూడో అంతస్తులో రత్నమ్మ అనే మహిళ తన కుమార్తె మనవరాళ్లతో కలిసి నివాసం ఉంటుంది.. మిద్దె పైన ఆరుబయట నిద్రిస్తున్న రత్నమును తెల్లవారుజాము సమయంలో గుర్తుతెలియని, వ్యక్తి నిద్రలేపగా రత్నమ్మ తడబడుతూ కళ్ళు తెరిచే సమయం లో కళ్లల్లో కారం చల్లారని అనంతరం తన చేయి ఒకరు పట్టుకోగా మరొకరు మెడలోని బంగారు సరుడు ను తీసుకున్నారని బాధితురాలు రత్నమ్మ తెలిపింది.. తనను పట్టుకున్న తీరును బట్టి వారి కదలికలను బట్టి వచ్చిన దొంగలు ఇద్దరిని వారిలో ఒకరు మహిళగా తాను భావిస్తున్నానని తెలిపారు.. ఇద్దరు పట్టుకోవడంతో భయంతో నోటమాట రాలేదు అని చేతులు విడిచి పెట్టిన వెంటనే తను గట్టిగా కేకలు వేయడంతో దొంగలు పారిపోయారని ఆమె తెలిపింది.. ఎత్తుకెళ్లిన బంగారు నగ 6 సవర్లు ఉందని విలువ రెండు లక్షల వరకు ఉంటుందని తెలిపింది.. సంఘటన జరిగిన స్థలాన్ని స్థానిక పోలీసులు పరిశీలించి వెళ్లారు. ఈ సంఘటనతో స్థానిక ప్రజలు భయపడి పోతున్నారు... ఆత్మకూరు డివిజన్ ప్రాంతంలో ఇటీవల కాలంలో గుళ్ళల్లో, ఇళ్లల్లో దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయని పోలీసుల నిఘా సరిగా లేవని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు...

.Conclusion:కిట్ నెం 698 కరీం నెల్లూరు జిల్లా ఆత్మకూరు.
Last Updated : Oct 28, 2019, 8:28 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.