ETV Bharat / state

బాబోయ్​ నకిలీ శానిటైజర్లు

author img

By

Published : Jun 18, 2020, 10:08 PM IST

కరోనా మహమ్మారి ప్రపంచాన్ని వణికిస్తోంది. ప్రస్తుతం ఏ కార్యాలయానికి వెళ్లినా... దుకాణానికి వెళ్లినా శానిటైజర్లు దర్శనమిస్తున్నాయి. లేనిపోని భయాలతో ఎంత ఖర్చయినా ప్రజలు వీటిని కొంటున్నారు. ఈ అవకాశాన్ని సొమ్ము చేసుకునేందుకు కొత్త దందాలకు తెరలేపుతున్నారు. ఇలానే నెల్లూరు నగరం సంతపేట ప్రాంతంలో నాసిరకం శానిటైజర్ తయారు చేస్తున్న ఓ వ్యక్తిని డ్రగ్ కంట్రోల్ అధికారులు పట్టుకున్నారు.

నెల్లూరులో నకిలీ శానిటైజర్లు పట్టివేత
నెల్లూరులో నకిలీ శానిటైజర్లు పట్టివేత

ప్రస్తుత పరిస్థితులను అదనుగా చేసుకుని నాశిరకం శానిటైజర్ తయారు చేస్తూ కొందరు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు నగరం సంతపేట ప్రాంతంలో నాసిరకం శానిటైజర్ తయారు చేస్తుండగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. బొమ్మి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో శ్రీనివాసులు అనే వ్యక్తి సంతపేట దగ్గర శానిటైజర్లు తయారు చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తెచ్చుకుని శానిటైజర్ తయారు చేస్తూ.... నకిలీ లేబుల్స్​తో అమ్మకాలు సాగిస్తున్నాడు. తన వద్ద శానిటైజర్లు దొరుకుతాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయటంతో ఆ విషయం డ్రగ్ కంట్రోల్ ఏడీ వీరకుమార్​, ఇన్​స్పెక్టర్​ మహేష్​లకు తెలిసింది. ఈ క్రమంలో వినియోగదారుల్లా తమకు సరకు కావాలంటూ సోషల్ మీడియాలోనే సంప్రదించారు. అనంతరం దాడులు నిర్వహించారు.

అతని నుంచి దాదాపు 500 శానిటైజర్ బాటిళ్లు, ముడిసరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్​కు తరలించారు. శానిటైజర్ తయారు చేసేందుకు సంబంధించిన లైసెన్స్ అతని వద్ద లేదని, అవి నాసిరకంగా ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్లతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కొండ గెడ్డ కాలువ ఆక్రమణపై రైతుల ఆగ్రహం

ప్రస్తుత పరిస్థితులను అదనుగా చేసుకుని నాశిరకం శానిటైజర్ తయారు చేస్తూ కొందరు లబ్ది పొందేందుకు ప్రయత్నిస్తున్నారు. నెల్లూరు నగరం సంతపేట ప్రాంతంలో నాసిరకం శానిటైజర్ తయారు చేస్తుండగా డ్రగ్ కంట్రోల్ అధికారులు ఓ వ్యక్తిని పట్టుకున్నారు. బొమ్మి మెడికల్ డిస్ట్రిబ్యూటర్ పేరుతో శ్రీనివాసులు అనే వ్యక్తి సంతపేట దగ్గర శానిటైజర్లు తయారు చేస్తున్నాడు. ఇతర ప్రాంతాల నుంచి ముడిసరుకు తెచ్చుకుని శానిటైజర్ తయారు చేస్తూ.... నకిలీ లేబుల్స్​తో అమ్మకాలు సాగిస్తున్నాడు. తన వద్ద శానిటైజర్లు దొరుకుతాయంటూ సోషల్ మీడియాలో ప్రచారం చేయటంతో ఆ విషయం డ్రగ్ కంట్రోల్ ఏడీ వీరకుమార్​, ఇన్​స్పెక్టర్​ మహేష్​లకు తెలిసింది. ఈ క్రమంలో వినియోగదారుల్లా తమకు సరకు కావాలంటూ సోషల్ మీడియాలోనే సంప్రదించారు. అనంతరం దాడులు నిర్వహించారు.

అతని నుంచి దాదాపు 500 శానిటైజర్ బాటిళ్లు, ముడిసరకును అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్​కు తరలించారు. శానిటైజర్ తయారు చేసేందుకు సంబంధించిన లైసెన్స్ అతని వద్ద లేదని, అవి నాసిరకంగా ఉన్నాయని డ్రగ్ కంట్రోల్ అధికారులు పేర్కొన్నారు. వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు, నాయకులు పేర్లతో శానిటైజర్లు తయారుచేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కొండ గెడ్డ కాలువ ఆక్రమణపై రైతుల ఆగ్రహం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.