నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం రేబాల గ్రామంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తన ఫోన్ ఎత్తటంలేదన్న కారణంతో ఓ యువకుడు బ్లేడుతో మహిళ గొంతు కోశాడు. ప్రాథమిక సమాచారం ప్రకారం.. గ్రామానికి చెందిన ఓ మహిళకి కోవూరుకు చెందిన వెంకట్ అనే యువకుడితో వివాహేతర సంబంధం ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఆ మహిళ వెంకట్ను దూరం పెడుతూ వస్తోంది. ఫోన్ చేసినా స్పందించటం లేదు. దీంతో కక్ష పెంచుకున్న వెంకట్.. తన స్నేహితుడు రవిని తీసుకొని మహిళ ఇంటికి వెళ్లాడు. ఆమెతో గొడవ పడి ఆవేశంలో బ్లేడుతో గొంతు కోశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యేందుకు ప్రయత్నించగా.. స్థానికులు పట్టుకొని స్తంభానికి కట్టేశారు. పోలీసులకు సమాచారం ఇవ్వటంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.
ఇవీ చూడండి