ETV Bharat / state

Water Released: ఖరీఫ్​ సీజన్​కు​ నీరు విడుదల.. నెలరోజుల ముందుగానే

author img

By

Published : Jun 7, 2023, 1:22 PM IST

Water Released From Prakasam Barrage: ప్రకాశం బ్యారేజ్‌ నుంచి పశ్చిమ కాల్వకు ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. కాల్వ పరిధిలోని చెరువులకు సుమారు 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. మంత్రి అంబటి రాంబాబు పూజలు చేసి నీటిని విడుదల చేశారు.

Water Released
Water Released
ఖరీఫ్​ సీజన్​కు​ నీరు విడుదల..

Krishna Delta Water Released: ఖరీఫ్ సీజన్​ నేపథ్యంలో కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు‌ విడుదల చేసింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులు కాలువలకు నీరు విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలువలోకి వదిలారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామని మంత్రి అంబటి తెలిపారు. ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశామని.. డిమాండ్​ను బట్టి మరింత పెంచే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు ఇచ్చామని మంత్రి అంబటి తెలిపారు. ఖరీఫ్ సీజన్​ త్వరగా ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. సాగర్ నుంచి నీరు రాకుండానే పులిచింతలలో‌ 34 టీఎంసీల నీరు నిల్వ ఉందన్న మంత్రి.. అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నామన్నారు.

పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదని వెల్లడించారు. ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదన్నారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యిందని తెలిపారు.

వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృష్ణా వరదల ప్రజలకు రక్షణ కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల: గుంటూరు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నుంచి 200 క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విడుదల చేశారు. కృష్ణా నదికి పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా సాగునీటి అవసరాలకు నీటి విడుదలను పెంచుతామని అధికారులు తెలిపారు. పశ్చిమ కాలువ కింద సుమారు 200 చెరువులకు నీటిని వదులుతామన్నారు.

ఖరీఫ్​ సీజన్​కు​ నీరు విడుదల..

Krishna Delta Water Released: ఖరీఫ్ సీజన్​ నేపథ్యంలో కృష్ణా డెల్టాకు రాష్ట్ర ప్రభుత్వం సాగు నీరు‌ విడుదల చేసింది. విజయవాడలోని ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణా ఈస్ట్రన్ హెడ్ రెగ్యులేటరీ ద్వారా జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు, మంత్రులు జోగి రమేష్, తానేటి వనిత, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్​ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావులు కాలువలకు నీరు విడుదల చేశారు. శాస్త్రోక్తంగా పూజ చేసి, కొబ్బరి కాయ కొట్టిన మంత్రి అంబటి రాంబాబు.. పూలు, పండ్లు, గాజులు, పసుపు, కుంకుమ, సారెను ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కాలువలోకి వదిలారు.

గుంటూరు, కృష్ణా జిల్లాల కాలువలకు నీరు విడుదల చేశామని మంత్రి అంబటి తెలిపారు. ఈరోజు వెయ్యి క్యూసెక్కుల నీరు విడుదల చేశామని.. డిమాండ్​ను బట్టి మరింత పెంచే అవకాశం ఉందని మంత్రులు తెలిపారు. పూర్వం జూన్ నెలాఖరులో, జులై మొదటి వారంలో వదిలేవారని.. కానీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో నెల ముందే నీరు ఇచ్చామని మంత్రి అంబటి తెలిపారు. ఖరీఫ్ సీజన్​ త్వరగా ప్రారంభం కావడం వల్ల మూడు పంటలు పండే అవకాశం ఉందని మంత్రి అంబటి పేర్కొన్నారు. ప్రకృతి విపత్తుల నుంచి కూడా రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండదని స్పష్టం చేశారు. సాగర్ నుంచి నీరు రాకుండానే పులిచింతలలో‌ 34 టీఎంసీల నీరు నిల్వ ఉందన్న మంత్రి.. అక్కడి నుంచే నీటిని రైతులకు అందిస్తున్నామన్నారు.

పట్టిసీమ నుంచి కుడా నీరు తెచ్చే అవసరం లేదని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక నీటి కొరత అనేదే లేదని వెల్లడించారు. ఈ సంవత్సరం పట్టిసీమ నుంచి నీరు తెచ్చే అవసరం ఉండదన్నారు. పులిచింతలలో 34 టీఎంసీల నీరు సరిపోతుందని స్పష్టం చేశారు. వైయస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో సమృద్ధిగా వర్షాలు పడతాయని నిరూపణ అయ్యిందని తెలిపారు.

వర్షాల వల్ల వచ్చే ఇబ్బందులు ఉంటే ముందస్తుగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కృష్ణా వరదల ప్రజలకు రక్షణ కల్పించేలా రిటైనింగ్ వాల్ నిర్మాణం చేశారని మంత్రి పేర్కొన్నారు. ప్రజల కోసం పూర్తి స్థాయిలో రక్షణ కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు.

తాగునీటి అవసరాల కోసం నీరు విడుదల: గుంటూరు జిల్లాలో తాగునీటి అవసరాల కోసం కృష్ణా నది నుంచి 200 క్యూసెక్కుల నీటిని జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు విడుదల చేశారు. కృష్ణా నదికి పూజలు నిర్వహించిన అనంతరం మంత్రి నీటిని దిగువకు విడుదల చేశారు. క్రమంగా సాగునీటి అవసరాలకు నీటి విడుదలను పెంచుతామని అధికారులు తెలిపారు. పశ్చిమ కాలువ కింద సుమారు 200 చెరువులకు నీటిని వదులుతామన్నారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.