ETV Bharat / state

మెగా డీఎస్సీ ప్రకటించకపోతే సత్తా చూపిస్తాం - నిరుద్యోగుల హెచ్చరిక

author img

By ETV Bharat Andhra Pradesh Team

Published : Jan 4, 2024, 7:16 PM IST

Students Demanded To Release Mega DSC Notification: పాదయాత్రలో డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23 వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు.

Students_Demanded_To_Release_Mega_DSC_Notification
Students_Demanded_To_Release_Mega_DSC_Notification
మెగా డీఎస్సీ ప్రకటించకపోతే సత్తా చూపిస్తాం - నిరుద్యోగుల హెచ్చరిక

Students Demanded to Release Mega DSC Notification: ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

DSC Candidates Protest in Avanigadda: పాదయాత్రలో డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దెవ చేశారు.

"నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" -విద్యార్థులు

మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ బడా మోసం - భగ్గుమన్న నిరుద్యోగులు, కలెక్టరేట్ ఎదుట ఆందోళన

గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే జగన్​కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు

వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.
వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.

ఏడాదికో డీఎస్సీ అన్నారు - ఐదేళ్లలో ఒక్కటీ లేదని మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు

మెగా డీఎస్సీ ప్రకటించకపోతే సత్తా చూపిస్తాం - నిరుద్యోగుల హెచ్చరిక

Students Demanded to Release Mega DSC Notification: ఉపాధ్యాయుల పోస్టుల గురించి మాట్లాడని సీఎం ఎవరైనా ఉన్నారంటే ఆ ఘనత మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని డీఎస్సీ విద్యార్థులు మండిపడ్డారు. కృష్ణాజిల్లా అవనిగడ్డలో వందల మంది డీఎస్సీ అభ్యర్థులు ఈరోజు రోడ్డెక్కారు. 23వేల పోస్టులతో మెగా డీఎస్సీ విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రిగా ప్రజలను పాలించడానికి వచ్చారా లేకపోతే ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకోవటానికి వచ్చారా అని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

DSC Candidates Protest in Avanigadda: పాదయాత్రలో డీఎస్సీ అభ్యర్థులకు ఇచ్చిన మాట నెరవేర్చుకుని 23వేల పోస్టులతో మెగా డీఎస్సీని తక్షణమే విడుదల చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నాలుగేళ్లలో డీఎస్సీ విడుదల చేయకపోవటం సిగ్గుచేటు, ఆవిరైపోతున్న ఉపాధ్యాయ నిరుద్యోగ ఆశలు, సున్నాలలో నోటిఫికేషన్ వద్దు మెగా డీఎస్సీ ముద్దు అంటూ విద్యార్థులు ఫ్లకార్డులతో నిరసనలు తెలిపారు. చంద్రబాబు నాయుడు హయాంలో రెండుసార్లు నోటిఫికేషన్ ఇస్తే జగన్ ఒక్కసారి కూడా విడుదల చేయకపోవటం సిగ్గు చేటు అని విద్యార్థులు ఎద్దెవ చేశారు.

"నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తున్నారు. హక్కుల కోసం పోరాడుతుంటే అరెస్టులకు పాల్పడుతుంది. తక్షణమే మెగా డీఎస్సీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి లేకపోతే నిరుద్యోగుల సత్తా ఎమిటో వచ్చే ఎన్నికల్లో చూపిస్తాం" -విద్యార్థులు

మెగా డీఎస్సీ పేరుతో సీఎం జగన్ బడా మోసం - భగ్గుమన్న నిరుద్యోగులు, కలెక్టరేట్ ఎదుట ఆందోళన

గత నాలుగు సంవత్సరాలుగా మెగా, జంబో, మినీ డీఎస్సీ అంటూన్నారు కాని ఇప్పటివరకూ ఒక్క పోస్టు కూడా విడుదల చేయకుండా జాప్యం చేశారని విద్యార్థులు విరుచుకుపడ్డారు. ప్రభుత్వం వారం రోజులు లోపు డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేయాలని లేకపోతే పక్క రాష్ట్రంలో కేసీఆర్​కు పట్టిన పరిస్థితే జగన్​కు పడుతుందని ఉద్యోగులు హెచ్చరించారు. ఏపీని నిరుద్యోగి రాష్ట్రంగా మారుస్తామన్న మీ హామీ ఏమైందని, నాలుగున్నర సంవత్సరాలుగా జగన్ ప్రభుత్వం మెుండి వైఖరి ప్రదర్శిస్తుందని అన్నారు. రాష్ట్ర ప్రజలు హక్కుల కోసం పోరాడుతుంటే ప్రభుత్వం అరెస్టులకు పాల్పడుతున్నారని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మెగా డీఎస్సీ ప్రకటించకుంటే వైసీపీ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతాం: నిరుద్యోగులు

వైసీపీ ప్రభుత్వం వారం రోజుల్లో మెగా డీఎస్సీ ప్రకటించకపోతే తాడేపల్లి ప్యాలెస్ ముట్టడిస్తామని విద్యార్థులు రోడ్డుపై బైటాయింపు ఆందోళన చేశారు.
వచ్చే ఎన్నికల్లో నిరుద్యోగుల సత్తా ఏంటో జగన్మోహనరెడ్డికి చూపిస్తామని హెచ్చరించారు. వీరిని అరెిస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నించటంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. డీఎస్సీ అభ్యర్థుల నిరసన కార్యక్రమానికి టీడీపీ జిల్లా ఉపాధ్యక్షులు మండలి వెంకట్రామ్ మద్దతు తెలిపారు. విద్యార్ధులు చదువుకోవడం వలన నిరుద్యోగ శాతం పెరుగుతుందని విద్యాశాఖ మంత్రి అనడం దారుణం విద్యార్థులు మండిపడ్డారు.

ఏడాదికో డీఎస్సీ అన్నారు - ఐదేళ్లలో ఒక్కటీ లేదని మంత్రి బొత్స ఇంటిని ముట్టడించిన నిరుద్యోగులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.