- రాష్ట్ర ప్రజలకు గవర్నర్, సీఎం దీపావళి శుభాకాంక్షలు
Diwali wishes: దీపావళి దివ్య దీవాలు అందరికీ శాంతి, శ్రేయస్సు, ఆనందాన్ని కలిగించాలని గవర్నర్, సీఎం ఆశించారు. దీపావళి సందర్బంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఇలాంటి పండగలు చీకటి నీడలను జయించి.. శాంతి, మత సామరస్యంతో కూడిన సమాజం నిర్మించడానికి మనందరికీ స్ఫూర్తినిస్తాయని గవర్నర్ అన్నారు. తెలుగు ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని సీఎం ఆకాంక్షించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- మిఠాయిలు పంచుకుందాం.. పండగ చేసుకుందాం
Sweets shops in AP: దీపావళి పండగను పురస్కరించుకొని రాష్ట్రవ్యాప్తంగా టపాసులతో పాటు మిఠాయిలకు గిరాకీ పెరిగింది. వివిధ సంస్థల్లో పనిచేసే ఉద్యోగులకు ఆయా సంస్థలకు చెందిన యజమానులు దీపావళి బోనస్తో పాటుగా స్వీట్లు ఇస్తుంటారు. దాంతో దీపావళి పర్వదినంలో స్వీట్ దుకాణాలు కొనుగొలుదారులతో కిటకిటలాడుతున్నాయి. ఈ పండక్కి అమ్మకాలు పెరిగినట్లు వ్యాపారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- విశాఖ రాజధాని వద్దన్న వారిని దోషులుగా చూడాలి: మంత్రి ధర్మాన
Dharmana Prasada Rao: విశాఖ రాజధాని ఏర్పాటు చేయటానికి వచ్చిన అవకాశాన్ని వదులుకోవద్దని మంత్రి ధర్మాన ప్రసాదరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ విడిపోవటం వల్ల వచ్చిన ఈ అవకాశాన్ని వద్దన్న వారిని దోషులుగా చూడాలని ఆయన అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'పాదయాత్రకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకపోతున్నారు'
Amaravati JAC leaders on padayatra: పాదయాత్రకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి వైకాపా నాయకులు ఓర్వలేక పోతున్నారని అమరావతి జేఏసీ నాయకులు అన్నారు. కోర్టు తీర్పును పోలీసులు తమకు ఇష్టం వచ్చినట్లుగా మలుచుకొని రైతుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దీపావళి అనంతరం హైకోర్టును ఆశ్రయించి పాదయాత్రను తిరిగి ప్రారంభిస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'దీపావళి' పురాణ గాథలు తెలుసా? ఇలా చేస్తే సకల సంపదలు మీవే!
చిన్నాపెద్దా అందరూ కలిసి ఎంతో ఆనందంగా చేసుకొనే వెలుగుల పండుగ దీపావళి. తమ జీవితంలో అమావాస్య చీకట్లను పారదోలి వెలుగులు నింపే సంతోషాల సంబరమిది. ఈ దివ్వెల పండుగ గురించి చెప్పే పురాణ గాథలివే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- దీపాల కాంతుల్లో మెరిసిన అయోధ్య, గిన్నిస్ రికార్డులో స్థానం
ప్రతి ఏడాదిలానే, ఈసారి కూడా అయోధ్య నగరంతో పాటు సరయు నది తీరంలో దీపోత్సవం వెలుగుల పండుగలా జరిగింది. దీపావళి నాడు అయోధ్యలో దీపోత్సవ్ పేరిట భారీ ఎత్తున వేడుక జరుపుకోవడం ఇది ఆరోసారి. ఈ సారి దీపావళి పండగకు ప్రధాని మోదీ హాజరయ్యారు. మోదీ అయోధ్య రాముడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సరయూ నది ఒడ్డున 22 వేల మంది వలంటీర్లు 18 లక్షలకు పైగా ప్రమిదలను వెలిగించి మరో గిన్నిస్ రికార్డును సృష్టించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఇంటిపై కూలిన యుద్ధ విమానం- ఇద్దరు పైలెట్లు మృతి
రష్యాకు చెందిన సుఖోయ్-30 యుద్ధ విమానం సైబీరియాలోని ఓ నివాస భవనంపై క్రాష్ అయింది. ఈ ఘటనలో ఇద్దరు పైలెట్లు చనిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'నోట్ల రద్దు వల్ల చాలా ప్రయోజనాలు.. అందుకే పన్ను వసూళ్లు పెరిగాయి'
పన్ను వసూళ్లలో పెరుగుదల నోట్ల రద్దు ఫలితమేనని ఆర్బీఐ ఎంపీసీ సభ్యురాలు ఆశిమా గోయల్ తెలిపారు. నోట్ల రద్దు వల్ల తాత్కాలిక సమస్యలు ఎదుర్కొన్నా.. దీర్ఘకాలంలో చాలా ప్రయోజనాలు ఉంటాయని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాకిస్థాన్పై భారత్ సూపర్ విక్టరీ.. నెట్టింట మీమ్స్ హల్చల్
ఉత్కంఠ పోరులో పాకిస్థాన్పై భారత్ సూపర్ విజయం సాధించింది. దాయాది జట్టుపై 4 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ నేపథ్యంలో మ్యాచ్కు సంబంధించి నెట్టింట అనేక మీమ్స్ హల్చల్ చేస్తున్నాయి. వాటిపై మీరూ ఓ లుక్కేయండి మరి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఓటీటీలో 'బ్రహ్మాస్త్ర' ఎప్పుడంటే? పార్ట్ 2 కోసం రంగంలోకి దిగిన డిస్నీ
రణ్బీర్ కపూర్, అలియా భట్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన బ్రహ్మాస్త్ర సినిమా విజయం సాధించింది. ఇది ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందా అని ఎదురుచూస్తున్న అభిమానులకి చిత్ర బృందం గుడ్ న్యూస్ చెప్పింది. ఓటీటీ రిలీజ్ డేట్ ప్రకటించింది. మరోవైపు ఈ సినిమా విడుదలకు ముందే రెండు భాగాలుగా తీసుకొస్తున్నట్లు ప్రకటించి చిత్ర బృందం. బ్రహ్మాస్త్ర-2 కోసం డిస్నీ సంస్థ భారీ కేటాయించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.