ETV Bharat / state

ఏకగ్రీవాలతో ఓటు హక్కు లేకుండా చేశారంటూ ఓటర్ల ధర్నా

author img

By

Published : Mar 7, 2021, 10:40 AM IST

కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పురపాలిక ఎన్నికల్లో 8 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. ప్రలోభాలకు లోనై అభ్యర్థులు ఏకగ్రీవాలు చేసుకున్నారని.. వారి వల్ల తాము ఓటు హక్కు వినియోగించుకోలేకపోతున్నామంటూ ఓటర్లు ధర్నా చేపట్టారు.

voters protest
ఏకగ్రీవాలతో ఓటు హక్కు లేకుండా చేశారంటూ ఓటర్ల ధర్నా

తమ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాలకు గురై... నామినేషన్లు ఉపసంహరించుకున్నారని.. అక్రమ పద్ధతిలో ఏకగ్రీవాలు చేసుకున్నారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పురపాలికలో ఓటర్ల ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నామ పత్రాలు ఉపసంహరించుకున్న అభ్యర్థుల దుకాణం ఎదుట ధర్నాకు దిగారు.

సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై రామిరెడ్డి అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న వారి సమస్య తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఎన్నికల అధికారులకు తెలియజేయాలని ఓటర్లకు సూచించారు.

తమ వార్డుల్లో పోటీ చేసే అభ్యర్థులు ప్రలోభాలకు గురై... నామినేషన్లు ఉపసంహరించుకున్నారని.. అక్రమ పద్ధతిలో ఏకగ్రీవాలు చేసుకున్నారని కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ పురపాలికలో ఓటర్ల ఆందోళన చేపట్టారు. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో నామ పత్రాలు ఉపసంహరించుకున్న అభ్యర్థుల దుకాణం ఎదుట ధర్నాకు దిగారు.

సమాచారం అందుకున్న పట్టణ ఎస్సై రామిరెడ్డి అక్కడికి చేరుకుని ధర్నా చేస్తున్న వారి సమస్య తెలుసుకున్నారు. ఏదైనా సమస్య ఉంటే ఎన్నికల అధికారులకు తెలియజేయాలని ఓటర్లకు సూచించారు.

ఇదీ చదవండి:

కర్నూలు జిల్లాలో 172 మంది అధికారులకు షోకాజ్ నోటీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.