ETV Bharat / state

కరోనా ఎఫెక్ట్: ఉరుకుంద ఈరన్న ఉత్సవాలు రద్దు - ఉరుకుందలో ఈరన్న ఉత్సవాలు రద్దు

శ్రావణ మాసం సందర్భంగా కర్నూలు జిల్లా.. ఉరుకుందలో ఏటా జరిగే ఈరన్న స్వామి ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. కరోనా వ్యాప్తి కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.

Temple utsav
Temple utsav
author img

By

Published : Jul 15, 2020, 9:04 PM IST

Updated : Jul 16, 2020, 7:18 AM IST

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు.

ఇటీవల లాక్ డౌన్ సడలింపుతో ఆలయాన్ని తెరిచారు. అనంతరం.. ఆలయంలో పలువురు సిబ్బందికి కరోనా సోకింగి. ఈ కారణంగానే.. ఉత్సవాలను రద్దు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆర్, ఆలయ ఈవో వాణి ప్రకటించారు. ప్రస్తుతం ఆలయంలో ఆరు కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈవో తెలిపారు.

కర్నూలు జిల్లా కౌతాళం మండలంలోని ఉరుకుంద ఈరన్నస్వామి శ్రావణ మాస ఉత్సవాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. కరోనా కేసులు పెరుగుతున్న క్రమంలో ఉత్సవాలను రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రతి సంవత్సరం శ్రావణ మాసంలో స్వామి వారిని దర్శించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలతోపాటు.. కర్ణాటక, మహారాష్ట్ర నుంచి దాదాపు 10 లక్షల మంది భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొనేవారు.

ఇటీవల లాక్ డౌన్ సడలింపుతో ఆలయాన్ని తెరిచారు. అనంతరం.. ఆలయంలో పలువురు సిబ్బందికి కరోనా సోకింగి. ఈ కారణంగానే.. ఉత్సవాలను రద్దు చేసినట్లు ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆర్, ఆలయ ఈవో వాణి ప్రకటించారు. ప్రస్తుతం ఆలయంలో ఆరు కోట్ల రూపాయలతో చేపట్టిన నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఈవో తెలిపారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కొత్త జిల్లాలు... అధ్యయనానికి కమిటీ ఏర్పాటు

Last Updated : Jul 16, 2020, 7:18 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.