కర్నూలు జిల్లా డోన్ పట్టణంలోని పలు దుకాణాల్లో చోరీకి పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేశారు. 50 లక్షల నగదు, 42 తులాల బంగారం, 24 కేజీల వెండి, 12 ఎల్ఈడీ టీవీలు, లాబ్ పరికరాలు, 3 హోమ్ థియేటర్లు, రెండు బైకులు వారి నుంచి స్వాధీనం చేసుకున్నారు. విజేయుడు, సంతోష్, ఈశ్వరయ్య అనే ముగ్గురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి 2017 నుంచి చోరీలకు పల్పడుతున్నట్లు డీఎస్పీ నరసింహ రెడ్డి తెలిపారు. వీరు బంగారు షాపులు, టీవీ షాప్లు, ఇళ్లను టార్గెట్ చేసి దొంగతనాలు చేస్తుంటారని తెలిపారు.
ఇవీ చూడండి...