ETV Bharat / state

పాణ్యంలో బస్సు బోల్తా.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

author img

By

Published : Oct 20, 2020, 3:45 PM IST

కర్నూలు జిల్లా పాణ్యం మండలంలో పెను ప్రమాదం తప్పింది. తమ్మరాజుపల్లె ఘాట్ లో ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి తీవ్రగాయలు కాకపోవడం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

bus bolta
పాణ్యంలో బస్సు బోల్తా

చిత్తూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలోని ఘాట్ రోడ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు తప్పి డివైడర్​ను దాటి అవతల వైపున కల్వర్టు గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ప్రయాణికురాలికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.

చిత్తూరు నుంచి కర్నూలుకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు పాణ్యం మండలం తమ్మరాజుపల్లె సమీపంలోని ఘాట్ రోడ్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. బస్సు అదుపు తప్పి డివైడర్​ను దాటి అవతల వైపున కల్వర్టు గుంతలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి తీవ్ర గాయాలు కాకపోవటంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. సమాచారం తెలుసుకున్న పాణ్యం పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి.. బస్సులో ఉన్న ప్రయాణికులను బయటకు తీసుకొచ్చారు. అయితే ఈ ప్రమాదంలో ఇద్దరు డ్రైవర్లు, ఒక ప్రయాణికురాలికి స్వల్ప గాయాలైనట్లు పోలీసులు వెల్లడించారు.

ఇవీ చూడండి...

కర్నూలులో సీఎం చిత్రపటానికి క్షీరాభిషేకం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.