ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆలయంలో విధులు నిర్వహించే ఇద్దరు పరిచారకులు, ముగ్గురు భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ... స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.
శ్రీశైలంలో వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేత - corona news srisailam
శ్రీశైలంలో రోజురోజుకు కరోనా ఉధృతి కొనసాగుతోంది. ఈ క్రమంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు తెలిపారు.

శ్రీశైలంలో వారంరోజుల పాటు దర్శనాల నిలిపివేత
ప్రముఖ శైవక్షేత్రం శ్రీశైలంలో బుధవారం నుంచి వారం రోజుల పాటు దర్శనాలు నిలిపివేస్తున్నామని ఆలయ ఈవో కె.ఎస్ రామరావు తెలిపారు. దేవాదాయశాఖ కమిషనర్ అనుమతితో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. ఆలయంలో విధులు నిర్వహించే ఇద్దరు పరిచారకులు, ముగ్గురు భద్రతా సిబ్బందికి కరోనా పాజిటివ్ నిర్ధరణ కావటంతో ఈ నిర్ణయం తీసుకున్నామని అన్నారు. భక్తులకు దర్శనాలు నిలిపివేసినప్పటికీ... స్వామి, అమ్మవార్లకు నిత్య కైంకర్యాలు, ఇతర సేవలు యథాతథంగా జరుగుతాయని ఆయన పేర్కొన్నారు.