కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం సంగమేశ్వర సమీపాన సిద్ధేశ్వర అలుగు నిర్మించాలని రాయలసీమ సాగు నీటి సమితి అధ్యక్షుడు బొజ్జా దశరథ రామిరెడ్డి డిమాండ్ చేశారు. సభ్యులతో కలిసి ఆయన, నంద్యాల పార్లమెంటు సభ్యుడు పొచా బ్రహ్మానంద రెడ్డికి వినతి పత్రం అందజేశారు. శ్రీశైలం జలాశయం నుంచి నీరు రాయలసీమకు రావాలంటే సిద్ధేశ్వర అలుగు ఏకైక మార్గమని వివరించారు. సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళతానని ఎంపీ హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: కర్నూలు జిల్లాలో మరో 35 మందికి కరోనా