ETV Bharat / state

'తెలంగాణ మద్యం ఆంధ్రాకు రానివ్వం' - police checking in kurnool dst

రాష్ట్రంలో మద్యం ధరలు భారీగా పెరిగిన కారణంగా... మందుబాబులు వేరే మార్గాలను ఎంచుకుంటున్నారు. కర్నూలు జిల్లాలో తెలంగాణ సరిహద్దులో ఉన్న దుకాణాల ద్వారా మద్యం కొనుగోలు చేస్తున్నారు. ఎక్సైజ్ అధికారులు దాడులు చేసి మద్యాన్ని స్వాధీనం చేసుకుంటున్నారు. ఇకపై ఇలా చేస్తే కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

police cheking at krunool dst checkpost
police cheking at krunool dst checkpost
author img

By

Published : May 10, 2020, 7:09 PM IST

కర్నూలు సమీపంలోని ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలో మద్యం రేట్లుకు ఆంధ్రప్రదేశ్ మద్యం రేట్లకు భారీ వ్వత్యాసం ఉండటంతో.. కర్నూలు సమీపంలోని ప్రజలు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయిన అలంపూరు చౌరస్తా వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. కొందరు ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తుండగా పోలీసులు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లను తీసుకుని వస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

కర్నూలు సమీపంలోని ఆంధ్రా తెలంగాణ సరిహద్దులో ఎక్సైజ్ అధికారులు తనిఖీలు ముమ్మరం చేశారు. తెలంగాణలో మద్యం రేట్లుకు ఆంధ్రప్రదేశ్ మద్యం రేట్లకు భారీ వ్వత్యాసం ఉండటంతో.. కర్నూలు సమీపంలోని ప్రజలు తెలంగాణ సరిహద్దు ప్రాంతం అయిన అలంపూరు చౌరస్తా వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నారు.

ఈ సమాచారం తెలుసుకున్న ఎక్సైజ్ శాఖ అధికారులు చెక్ పోస్టుల వద్ద తనిఖీలు నిర్వహించారు. కొందరు ద్విచక్ర వాహనాలపై మద్యం తరలిస్తుండగా పోలీసులు బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎవరైనా ఇతర రాష్ట్రాల మద్యం బాటిళ్లను తీసుకుని వస్తే వారిపై కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు.

ఇదీ చూడండి:

నివేదిక వచ్చే వరకు గ్రామాలకు రావొద్దు'

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.