ETV Bharat / state

అసంపూర్తి వంతెనపై కాలిబాట.. అష్టకష్టాల్లో ప్రజలు

సాధారణ రోజుల్లో వంతెన లేకపోయినా ఏదో ఓకలా.. అక్కడి ప్రజలు రాకపోకలు సాగిస్తారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు.. నదిలో నీరు పారుతుంటుంది. వెళ్లటానికి సాధ్యం కాదు. అయినా.. అత్యవసరం అనుకున్నవాళ్లు.. అసంపూర్తిగా ఉన్న వంతెనును సైతం దాటేందుకు కర్నూలు నగరంలో అష్టకష్టాలు పడుతున్నారు.

author img

By

Published : Sep 25, 2020, 5:33 PM IST

Updated : Sep 29, 2020, 1:20 PM IST

హంద్రీ నదిపై అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు
హంద్రీ నదిపై అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు

కర్నూలు ఓల్డ్ సిటీ-జోహరాపురం ప్రాంతాల మధ్య నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఓల్డ్ సిటీ నుంచి జోహరాపురం, నంద్యాల చెక్ పోస్టు, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఈ మార్గం నుంచే రాకపోకలు సాగించేవారు. గతంలో హంద్రీనదిపై వంతెన ఉండేది. అది చాలా పాతది కావటం, తరచుగా వరదలు వస్తుండటంతో.. బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వర్షాకాలంలో రాకపోకలు సాగించటం కష్టతరంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. ప్రస్తుత వంతెనపై కొత్త వంతెన నిర్మాణానికి అడుగులుపడ్డాయి.

హంద్రీ నదిలో వరద ప్రవాహం..

2018లో రూ.7.2 కోట్ల అంచనా వ్యయంతో.. వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం హంద్రీనదిలో వరద ప్రవాహం ఉండటంతో.. ప్రజలు రాకపోకలు సాగించటం ఇబ్బందికరంగా ఉంది.

అటు ఇటు నిచ్చెనతోనే..

వంతెన పూర్తి కాకపోవటంతో స్థానికులు అటువైపు ఒకటి, ఇటు వైపు ఒకటి నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు. నీటి ప్రవాహం ఉండటంతో.. నిచ్చెన వరకు తాడును కట్టారు. ఆ తాడు సాయంతో.. నీటిలో నిచ్చెన వరకు వెళ్లి.. జాగ్రత్తగా ఎక్కి.. అటువైపు చేరుకుని.. మళ్లీ నిచ్చెన దిగాల్సి వస్తోంది.

హంద్రీ నది అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు
హంద్రీ నది అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు

వారికి నిచ్చెన ఎక్కడం కష్టం..

యువకులు, సాధారణ వ్యక్తులు సాహసాలు చేస్తున్నా.. చిన్నారులు, వృద్ధులు, రోగులు నిచ్చెన ఎక్కటం కష్టంగా ఉంది. లేదంటే.. ఆటో, ద్విచక్ర వాహనాల్లో.. నగరం మీదుగా సుమారు 8 కిలోమీటర్లు వచ్చిపోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో రావటం వల్ల సమయం, డబ్బు వృథా అని ప్రజలు ఆందోళన వెలిబుచ్చారు.

సందర్శించిన పవన్..

గతంలో ఈ బ్రిడ్జిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తరచుగా.. ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. జమ్మిచెట్టు వైపు బ్రిడ్జిపనులు కొంతవరకు జరుగుతున్నా.. జోహరాపురం వైపు పనులు ముందుకు సాగటం లేదు. బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అసంపూర్తి వంతెనపై కాలిబాట.. అష్టకష్టాల్లో ప్రజలు

ఇవీ చూడండి : ప్రారంభోత్సవానికి ముస్తాబైన హైదరాబాద్ దుర్గంచెరువు 'కేబుల్ బ్రిడ్జి'

కర్నూలు ఓల్డ్ సిటీ-జోహరాపురం ప్రాంతాల మధ్య నిత్యం వందల మంది రాకపోకలు సాగిస్తుంటారు. ఓల్డ్ సిటీ నుంచి జోహరాపురం, నంద్యాల చెక్ పోస్టు, నందికొట్కూరు తదితర ప్రాంతాలకు వెళ్లాల్సినవారు ఈ మార్గం నుంచే రాకపోకలు సాగించేవారు. గతంలో హంద్రీనదిపై వంతెన ఉండేది. అది చాలా పాతది కావటం, తరచుగా వరదలు వస్తుండటంతో.. బ్రిడ్జి పూర్తిగా కొట్టుకుపోయింది. వర్షాకాలంలో రాకపోకలు సాగించటం కష్టతరంగా మారింది. గత తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో.. ప్రస్తుత వంతెనపై కొత్త వంతెన నిర్మాణానికి అడుగులుపడ్డాయి.

హంద్రీ నదిలో వరద ప్రవాహం..

2018లో రూ.7.2 కోట్ల అంచనా వ్యయంతో.. వంతెన పనులు ప్రారంభమయ్యాయి. ఏడాదిలోగా అందుబాటులోకి రావాల్సి ఉన్నా.. ఇంతవరకు పూర్తి కాలేదు. ప్రస్తుతం హంద్రీనదిలో వరద ప్రవాహం ఉండటంతో.. ప్రజలు రాకపోకలు సాగించటం ఇబ్బందికరంగా ఉంది.

అటు ఇటు నిచ్చెనతోనే..

వంతెన పూర్తి కాకపోవటంతో స్థానికులు అటువైపు ఒకటి, ఇటు వైపు ఒకటి నిచ్చెనలు ఏర్పాటు చేసుకున్నారు. నీటి ప్రవాహం ఉండటంతో.. నిచ్చెన వరకు తాడును కట్టారు. ఆ తాడు సాయంతో.. నీటిలో నిచ్చెన వరకు వెళ్లి.. జాగ్రత్తగా ఎక్కి.. అటువైపు చేరుకుని.. మళ్లీ నిచ్చెన దిగాల్సి వస్తోంది.

హంద్రీ నది అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు
హంద్రీ నది అసంపూర్తి వంతెనపై కాలి బాట.. అష్టకష్టాల్లో ప్రజలు

వారికి నిచ్చెన ఎక్కడం కష్టం..

యువకులు, సాధారణ వ్యక్తులు సాహసాలు చేస్తున్నా.. చిన్నారులు, వృద్ధులు, రోగులు నిచ్చెన ఎక్కటం కష్టంగా ఉంది. లేదంటే.. ఆటో, ద్విచక్ర వాహనాల్లో.. నగరం మీదుగా సుమారు 8 కిలోమీటర్లు వచ్చిపోవాల్సి ఉంటుంది. ఈ మార్గంలో రావటం వల్ల సమయం, డబ్బు వృథా అని ప్రజలు ఆందోళన వెలిబుచ్చారు.

సందర్శించిన పవన్..

గతంలో ఈ బ్రిడ్జిని జనసేన అధినేత పవన్ కల్యాణ్ సందర్శించారు. నిర్మాణ పనులు త్వరగా పూర్తి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తరచుగా.. ప్రజా సంఘాలు ఆందోళనలు నిర్వహిస్తూనే ఉన్నాయి. జమ్మిచెట్టు వైపు బ్రిడ్జిపనులు కొంతవరకు జరుగుతున్నా.. జోహరాపురం వైపు పనులు ముందుకు సాగటం లేదు. బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

అసంపూర్తి వంతెనపై కాలిబాట.. అష్టకష్టాల్లో ప్రజలు

ఇవీ చూడండి : ప్రారంభోత్సవానికి ముస్తాబైన హైదరాబాద్ దుర్గంచెరువు 'కేబుల్ బ్రిడ్జి'

Last Updated : Sep 29, 2020, 1:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.