ETV Bharat / state

రికార్డ్​ ధర పలికిన ఉల్లి...అన్నదాతల హర్షం..

కర్నూలు ఉల్లి రైతులకు మంచి రోజులు వస్తున్నాయి. ఈ సీజన్​లో రికార్డు స్థాయిలో మద్దతు ధరలు లభిస్తున్నాయి.

author img

By

Published : Sep 17, 2019, 10:11 PM IST

ఉల్లిపాయలు
ఉల్లికి రికార్డు ధర....అన్నదాతల హర్షం..

కర్నూలులో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. క్వింటా ఉల్లి 3వేల 310 రూపాయలకు చేరింది. మంగళవారం మొత్తం 6వేల 489 క్వింటాళ్ల పంట మార్కెట్​కు వచ్చింది. నాణ్యమైన ఉల్లికి 3 వేల రూపాయలకుపైగా ధర పలకగా.. కనిష్ఠ ధర 16వందల20 రూపాయలుగా ఉంది. సరాసరిగా 2వేల 830 రూపాయల ధర పలుకుతుండటంతో... రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఉల్లికి రికార్డు ధర....అన్నదాతల హర్షం..

కర్నూలులో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో ఉల్లి ధర పలికింది. క్వింటా ఉల్లి 3వేల 310 రూపాయలకు చేరింది. మంగళవారం మొత్తం 6వేల 489 క్వింటాళ్ల పంట మార్కెట్​కు వచ్చింది. నాణ్యమైన ఉల్లికి 3 వేల రూపాయలకుపైగా ధర పలకగా.. కనిష్ఠ ధర 16వందల20 రూపాయలుగా ఉంది. సరాసరిగా 2వేల 830 రూపాయల ధర పలుకుతుండటంతో... రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఇది కూడా చదవండి.

వరదలో చిక్కుకున్న గొర్రెల కాపర్లు..రక్షించిన పోలీసులు

Intro:తూర్పుగోదావరి జిల్లాలోని ఏలూరు జలాశయం నిండి జలకళ సంతరించుకుంది.


Body:చెరువు నిండితేనే చెప్పలేని ఆనందంలో మునిగిపోతారు రైతులు.అలాంటిది అట్టడుగు స్థాయిలో నీరు నిలువ ఉండే జలాశయం నిండుకుండలా మారితే వారి సంతోషానికి అవధులు ఉండవు.తూర్పుగోదావరి జిల్లాలోని ఏలేరు ప్రాజెక్టు జలకళ సంతరించుకోవటంతో సాగు,త్రాగు నీటి కష్టాలు దూరం కానున్నాయి.
v.o1: కొన్ని వేల ఎకరాలకు సాగునీరు అందించటానికి ఉద్దేశించి ఏలేరు జలాశయాన్ని నిర్మించారు.దీని ద్వారా ప్రత్తిపాడు, పెద్దాపురం, పిఠాపురం, జగ్గంపేట నియోజకవర్గాలకు నీరు అందుతుంది. దాదాపు 67వేల ఎకరాలు దీని కింద సాగవుతున్నాయి.అంతేకాకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ పారిశ్రామిక అవసరాలను కూడా తీరుస్తోంది. ఈ ప్రాజెక్టు పూర్తిస్థాయి నిలువ సామర్థ్యం 24.11 t.m.cలు కాగా ఎగువ ప్రాంతంలో వర్షాల కారణంగా భారీ స్థాయిలో వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం సుమారు 20 t.m.cల వరకు నీరు నిలువ ఉండటంతో నియోజకవర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
v.o2: ఒకప్పుడు ఈ జలాశయం పరిస్థితి కొరకరాని కొయ్యలా ఉండేది. ఇందులో 24 t.m.cల నిల్వ సామర్థ్యం ఉన్న కేవలం 8నుంచి 9 t.m.cలు మాత్రమే నీరు ఉండేది.అందుకే గత ప్రభుత్వం పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ద్వారా గోదావరి నీటిని ఈ ప్రాజెక్టులోకి మల్లిచింది. దీంతో రెండు సంవత్సరాలుగా ఈ జలాశయం పూర్తిస్థాయిలో నిండుతుంది. ఇప్పుడు కొన్ని కారణాల వల్ల పురుషోత్తపట్నం పథకం ఆగిపోయింది. పర్యావరణానికి ఇబ్బందులు ఉన్నాయంటూ కోర్టులో కేసు నమోదు కావటంతో దీనికి బ్రెకులు పడ్డాయి. ఇప్పటికే ఈ ఎత్తిపోతల ద్వారా 16నుంచి 20 t.m.cలు ఏలేరు జలాశయానికి తరలించారు. కానీ భవిష్యత్తులో మళ్లీ దీనికి పాత గతే పడుతుందేమో అని ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
evo: ఎప్పటిలాగానే ఏలూరు ప్రాజెక్టుకు గోదావరి జలాలని అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.


Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.