NO BRIDGE: కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మున్సిపాలిటీలోని సున్నం బట్టీ వీధిలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు.. మురుగు నీటి కాలువ కల్వర్టు కొట్టుకుపోయింది. దాంతో అవతలి వైపునకు వెళ్లేందుకు తాత్కాలికంగా గొట్టాలు వేశారు.. వాటిని దాటుకుంటూనే కాలనీవాసులు, విద్యార్థులు అవతలివైపుకు వెళ్తున్నారు. దానికి అవతల పాఠశాల ఉండటంతో పిల్లలు ఆ గొట్టాలను దాటుకుని వెళ్తున్నారు. వాటిని దాటే క్రమంలో అవి ఎత్తుగా ఉండటం వల్ల.. కొందరు కింద పడిపోతున్నారని.. ముఖ్యంగా చిన్న పిల్లలు, వృద్ధులు అవస్థలు పడుతున్నారని స్థానికులు చెబుతున్నారు. తెగిపోయిన కల్వర్టును త్వరగా నిర్మించాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చదవండి: