ETV Bharat / state

కేరళలో చిక్కుకున్న నంద్యాల వాసులు - కేరళలో చిక్కుకున్న నంద్యాల వాసులు

కరోనా లాక్ డౌన్ కారణంగా చాలామంది రాష్ట్ర ప్రజలు వేరే ప్రాంతాల్లో చిక్కుకుపోయారు. కర్నూలు జిల్లా నంద్యాల వాసులు ఉపాధి కోసం వెళ్లి కేరళలో ఉండిపోయారు. తమను స్వస్థలాలకు చేర్చాలని వారు అధికారులను వేడుకుంటున్నారు.

nandyala people struck in kerala
కేరళలో నంద్యాల వాసులు
author img

By

Published : Apr 15, 2020, 2:31 PM IST

తమను స్వస్థలానికి చేర్చాలని కేరళలోని నంద్యాల ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణం కోటా వీధి, ఉప్పరిపేట, నడిగడ్డ, పోలూరు, బండి ఆత్మకూరు, పార్నపల్లె ప్రాంతాలకు చెందిన 12 మంది కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లా తిరూ ప్రాంతంలో పాలీష్‌ బండలు, టైల్స్‌ పనులు చేస్తూ కొన్నేళ్లుగా జీవిస్తున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన మేస్త్రీ గౌస్‌ ఆధ్వర్యంలో అక్కడ వీరంతా ఉపాధి పొందారు. గౌస్‌ దిల్లీలో నిర్వహించిన జమాత్‌కు హాజరయ్యారు. దాంతో కేరళ ప్రభుత్వం గౌస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉంచింది. మిగతా వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. ప్రస్తుతం తమకు ఉపాధి లేదని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

ఇవీ చదవండి:

తమను స్వస్థలానికి చేర్చాలని కేరళలోని నంద్యాల ప్రాంత వాసులు విజ్ఞప్తి చేశారు. నంద్యాల పట్టణం కోటా వీధి, ఉప్పరిపేట, నడిగడ్డ, పోలూరు, బండి ఆత్మకూరు, పార్నపల్లె ప్రాంతాలకు చెందిన 12 మంది కేరళ రాష్ట్రంలోని మణప్పురం జిల్లా తిరూ ప్రాంతంలో పాలీష్‌ బండలు, టైల్స్‌ పనులు చేస్తూ కొన్నేళ్లుగా జీవిస్తున్నారు. నంద్యాల పట్టణానికి చెందిన మేస్త్రీ గౌస్‌ ఆధ్వర్యంలో అక్కడ వీరంతా ఉపాధి పొందారు. గౌస్‌ దిల్లీలో నిర్వహించిన జమాత్‌కు హాజరయ్యారు. దాంతో కేరళ ప్రభుత్వం గౌస్‌కు వైద్య పరీక్షలు నిర్వహించి క్వారంటైన్‌కు తరలించింది. పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. అనంతరం హోం ఐసోలేషన్‌లో ఉంచింది. మిగతా వారికి ఎలాంటి వ్యాధి లక్షణాలు లేవు. ప్రస్తుతం తమకు ఉపాధి లేదని స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వారు కోరారు.

ఇవీ చదవండి:

రాష్ట్ర వ్యాప్తంగా కూరగాయల ధరలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.