కర్నూలు జిల్లా నందికొట్కూరు ఎమ్మెల్యే ఆర్థర్.. పట్టణంలోని వార్డుల్లో పర్యటించారు. రెండు నుంచి ఐదో వార్డు పరిధిలో ఉన్న ప్రాంతాల్లో స్థానికులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. కొన్ని కాలనీల్లో రహదారులు లేవని, మంచినీటి సమస్య ఉందని, మురుగు కాలువల సమస్యలు ఉన్నాయని ఎమ్మెల్యే దృష్టికి కాలనీవాసులు తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే... రహదారుల నిర్మాణానికి నిధులు వచ్చాయని.. ఈ నెలాఖరులోగా పనులు ప్రారంభిస్తామని చెప్పారు. మంచినీటి సమస్య తీర్చేందుకు అలగనూరు జలాశయం నుంచి నందికొట్కూరు పురపాలక 103 కోట్ల వ్యయంతో త్వరలోనే పనులు జరుగుతాయని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: