ETV Bharat / state

లక్షకు రూ.3 లక్షలిస్తామంటూ మోసం.. రూ.3 కోట్లకు టోకరా

author img

By

Published : Oct 2, 2020, 12:06 PM IST

'మీరు లక్ష రూపాయలు కడితే చాలు.. 2 నెలల్లో రూ.3 లక్షలు చేతికొస్తాయి. అదీ ఒకసారే కాదు.. రోజుకు రూ. 5 వేలు చొప్పున చెల్లిస్తాం' అంటూ ఓ సంస్థ ప్రజలను దారుణంగా మోసం చేసింది. జనాలతో డబ్బులు కట్టించుకుని తర్వాత ముఖం చాటేసింది. ఆ సంస్థకు సొమ్ము చెల్లించి మోసపోయిన బాధితులు ఇప్పుడు లబోదిబోమంటున్నారు. ఈ ఘటన కర్నూలు జిల్లాలో జరిగింది.

money fraud incident in allagadda
లక్షకు 3 లక్షలిస్తామంటూ మోసం

లక్షకు మూడు లక్షలు ఇస్తామంటూ ఓ సంస్థ ప్రజలను మోసం చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. అహోబిలం గ్రామ కేంద్రంగా ఈ మోసం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బెటర్ వే సొల్యూషన్' పేరుతో ఒక సంస్థ ప్రజలను దారుణంగా మోసం చేసింది. ఆళ్లగడ్డ, అహోబిలం గ్రామాలకు చెందిన కొందరు ఈ సంస్థకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. లక్ష రూపాయలు కడితే రోజుకు రూ. 5 వేల చొప్పున 60 రోజులపాటు సంస్థ చెల్లిస్తుందని.. దీంతో రూ.3 లక్షలు వస్తాయని చెప్పి ప్రజలను అందులో చేర్పించారు. నగదును సంస్థ ఖాతాలో ఆన్​లైన్ ద్వారా జమ చేయించారు. కొన్నిరోజులపాటు సంస్థ రోజుకు రూ. 5వేలు చొప్పున జనాలకు బాగానే డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.

ముందు చెల్లించిన వారికి డబ్బులు బాగానే వస్తుండటంతో మరికొందరు బెటర్ వే సంస్థకు లక్ష రూపాయలు కట్టారు. ఇలా మొత్తం సంస్థ ఖాతాలో రూ. 3 కోట్లు జమయ్యాయి. ఇక అంతే ఆ తర్వాత నుంచి ప్రజలకు డబ్బులు చెల్లించడం మానేశారు. సంస్థ సర్వర్ కూడా పని చేయలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన జనం పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 4 వందల మంది మోసపోయినట్లు తెలుస్తోంది. సీఐ సుదర్శనప్రసాద్ అహోబిలం చేరుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

లక్షకు మూడు లక్షలు ఇస్తామంటూ ఓ సంస్థ ప్రజలను మోసం చేసిన ఘటన కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో జరిగింది. అహోబిలం గ్రామ కేంద్రంగా ఈ మోసం జరిగింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. 'బెటర్ వే సొల్యూషన్' పేరుతో ఒక సంస్థ ప్రజలను దారుణంగా మోసం చేసింది. ఆళ్లగడ్డ, అహోబిలం గ్రామాలకు చెందిన కొందరు ఈ సంస్థకు మధ్యవర్తులుగా వ్యవహరించారు. లక్ష రూపాయలు కడితే రోజుకు రూ. 5 వేల చొప్పున 60 రోజులపాటు సంస్థ చెల్లిస్తుందని.. దీంతో రూ.3 లక్షలు వస్తాయని చెప్పి ప్రజలను అందులో చేర్పించారు. నగదును సంస్థ ఖాతాలో ఆన్​లైన్ ద్వారా జమ చేయించారు. కొన్నిరోజులపాటు సంస్థ రోజుకు రూ. 5వేలు చొప్పున జనాలకు బాగానే డబ్బులు చెల్లించింది. ఆ తర్వాతే అసలు కథ ప్రారంభమైంది.

ముందు చెల్లించిన వారికి డబ్బులు బాగానే వస్తుండటంతో మరికొందరు బెటర్ వే సంస్థకు లక్ష రూపాయలు కట్టారు. ఇలా మొత్తం సంస్థ ఖాతాలో రూ. 3 కోట్లు జమయ్యాయి. ఇక అంతే ఆ తర్వాత నుంచి ప్రజలకు డబ్బులు చెల్లించడం మానేశారు. సంస్థ సర్వర్ కూడా పని చేయలేదు. దీంతో మోసపోయామని గ్రహించిన జనం పోలీసులను ఆశ్రయించారు. దాదాపు 4 వందల మంది మోసపోయినట్లు తెలుస్తోంది. సీఐ సుదర్శనప్రసాద్ అహోబిలం చేరుకుని నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..

ట్యూషన్ టీచర్ నిర్వాకం.. విద్యార్థులతో పాటు తల్లిదండ్రులకు కరోనా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.