ETV Bharat / state

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని దర్శించుకున్న కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్

మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక పశు సంవర్దక శాఖ మంత్రి ప్రభుచౌహాన్, సినీ దర్శకుడు, రచయిత ఎస్​ఎస్​ విజయేంద్ర ప్రసాద్​ దర్శించుకున్నారు. అంతకుముందు గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

author img

By

Published : Oct 6, 2021, 9:11 PM IST

కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్
కర్ణాటక మంత్రి ప్రభుచౌహాన్

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక పశు సంవర్దక శాఖ మంత్రి ప్రభుచౌహాన్ దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ రాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి.. శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రాలయం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ దర్శకుడు, రచయిత ఎస్​ఎస్​ విజయేంద్ర ప్రసాద్​ దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: Mantralayam : మంత్రాలయ రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు

కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామిని కర్ణాటక పశు సంవర్దక శాఖ మంత్రి ప్రభుచౌహాన్ దర్శించుకున్నారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

శ్రీ రాఘవేంద్ర మూల బృందావనాన్ని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. వీరికి శ్రీ మఠం పీఠాధిపతి శ్రీ సుభుధేంద్ర తీర్థ స్వామి.. శేష వస్త్రం, ఫల మంత్రాక్షితలిచ్చి ఆశీర్వదించారు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. మంత్రి పర్యటన నేపథ్యంలో మంత్రాలయం పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

శ్రీ రాఘవేంద్ర స్వామిని సినీ దర్శకుడు, రచయిత ఎస్​ఎస్​ విజయేంద్ర ప్రసాద్​ దర్శించుకున్నారు.

ఇదీ చదవండి: Mantralayam : మంత్రాలయ రాఘవేంద్రుని సేవలో ప్రముఖులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.