ETV Bharat / state

ఇసుక లభించడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన - పాణ్యంలో సెల్ టవర్ ఎక్కిన యువకుడు

ఇసుక లభించడం లేదని ఓ వ్యక్తి సెల్​టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. ఈ ఘటన కర్నూలు జిల్లా పాణ్యం లో జరిగింది. ఇసుక సమస్యను పరిష్కరించేందుకు అధికారులు ఎలాంటి చొరవ చూపడం లేదని బాధితుడు ఆగ్రహం వ్యక్తం చేశాడు.

ఇసుక లభించడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన
ఇసుక లభించడం లేదని సెల్ టవర్ ఎక్కి నిరసన
author img

By

Published : Nov 25, 2020, 8:45 PM IST

కర్నూలు జిల్లా పాణ్యంలో ఇసుక లభించడం లేదని పరమేశ్వర్​రెడ్డి అనే వ్యక్తి సెల్​టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. బలపనూరు గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇసుక లభించకపోవటంతో 40 వేలు పెట్టి బ్లాక్ లో ఇసుకను కొనుగోలు చేశాడు. ఇసుక సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇసుక లభించకపోవటం కారణంగా సెల్ టవర్ ఎక్కినట్లు గుర్తించిన స్థానికులు అతన్ని బుజ్జగించి కిందికి దించారు.

కర్నూలు జిల్లా పాణ్యంలో ఇసుక లభించడం లేదని పరమేశ్వర్​రెడ్డి అనే వ్యక్తి సెల్​టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. బలపనూరు గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి ఇంటి నిర్మాణం చేపట్టాడు. ఇసుక లభించకపోవటంతో 40 వేలు పెట్టి బ్లాక్ లో ఇసుకను కొనుగోలు చేశాడు. ఇసుక సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయినా ఎలాంటి ఫలితం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. ఇసుక లభించకపోవటం కారణంగా సెల్ టవర్ ఎక్కినట్లు గుర్తించిన స్థానికులు అతన్ని బుజ్జగించి కిందికి దించారు.

ఇదీ చదవండి

నిర్మానుష్యంగా మంత్రాలయం పుష్కర ఘాట్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.