ETV Bharat / state

కర్నూలులో పోలీసుల మొబైల్​ రికవరీ మేళా..

author img

By

Published : Jan 7, 2023, 3:51 PM IST

Police Mobile Recovery Mela: చోరీకి గురైన ఫోన్లను కర్నూలు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకుని.. బాధితులకు అప్పగించే కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ఊహించని స్థాయిలో సెల్​ఫోన్లను పట్టుకున్నారు.

Etv Bharat
Etv Bharat

Police Mobile Recovery Mela : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2కోట్ల రూపాయల విలువగల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొగొట్టకున్న సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించేందుకు.. కర్నూలు పోలీసులు మొబైల్​ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతునే ఉంటుందని పోలీసులు తెలిపారు.

సిద్ధార్థ కౌశల్ ,ఎస్పీ

ఇప్పటి వరకు పోలీసులు స్వాధీన చేసుకున్నవాటి విలువ సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 1042 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తమ సెల్​ఫోన్లు పొగొట్టుకున్నవారు కర్నూలు పోలీసు వెబ్​సైట్​లో వివరాలు నమోదు చేస్తే రికవరీ చేసి ఇస్తామని తెలిపారు. దేశంలో వివిద ప్రాంతాలలో పొగొట్టుకున్న సెల్​ఫోన్లను రికవరీ చేసి అందించినట్లు వెల్లడించారు. రాజస్థాన్​లో పోయిన ఫోన్​ కేరళలో పట్టుకున్నామని అన్నారు. విశాఖ, కృష్ణా, అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన బాధితుల ఫోన్లను ఇప్పటివరకు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

"అందరికి తెలుసు మొబైల్​ ఫోన్​ పోతే దాని పరిష్కారం అంతా సులభంగా ఉండేది కాదు. ఇప్పుడు పోలీస్​ స్టేషన్​కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీసేవ సెంటర్​కు వెళ్లాల్సిన అవసరం లేదు. కర్నూలు పోలీస్​ వెబ్​సైట్​కి వెళ్లి వివరాలు నమోదు చేస్తే.. సాధ్యమైనంత వరకు మొబైల్​ ఫోన్లను పట్టుకుని మీకు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్​లో ఉన్నావారు ఎవరైనా సరే వివరాలు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మంచి ప్రోత్సాహం వస్తే ఇంకా ముందుకు కొనసాగిస్తాము."-సిద్ధార్థ కౌశల్ ,ఎస్పీ

ఇవీ చదవండి:

Police Mobile Recovery Mela : కర్నూలు జిల్లాలో పోలీసులు భారీ స్థాయిలో సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకు దాదాపు 2కోట్ల రూపాయల విలువగల ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పొగొట్టకున్న సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అప్పగించేందుకు.. కర్నూలు పోలీసులు మొబైల్​ రికవరీ మేళా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమం ఇంకా కొనసాగుతునే ఉంటుందని పోలీసులు తెలిపారు.

సిద్ధార్థ కౌశల్ ,ఎస్పీ

ఇప్పటి వరకు పోలీసులు స్వాధీన చేసుకున్నవాటి విలువ సుమారు 2 కోట్ల 50 లక్షల రూపాయల వరకు ఉంటుందని తెలిపారు. దాదాపు 1042 సెల్​ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. రాష్ట్రంలో ఎక్కడైనా సరే తమ సెల్​ఫోన్లు పొగొట్టుకున్నవారు కర్నూలు పోలీసు వెబ్​సైట్​లో వివరాలు నమోదు చేస్తే రికవరీ చేసి ఇస్తామని తెలిపారు. దేశంలో వివిద ప్రాంతాలలో పొగొట్టుకున్న సెల్​ఫోన్లను రికవరీ చేసి అందించినట్లు వెల్లడించారు. రాజస్థాన్​లో పోయిన ఫోన్​ కేరళలో పట్టుకున్నామని అన్నారు. విశాఖ, కృష్ణా, అనంతపురం తదితర ప్రాంతాలకు చెందిన బాధితుల ఫోన్లను ఇప్పటివరకు రికవరీ చేసినట్లు వెల్లడించారు.

"అందరికి తెలుసు మొబైల్​ ఫోన్​ పోతే దాని పరిష్కారం అంతా సులభంగా ఉండేది కాదు. ఇప్పుడు పోలీస్​ స్టేషన్​కి వెళ్లాల్సిన అవసరం లేదు. మీసేవ సెంటర్​కు వెళ్లాల్సిన అవసరం లేదు. కర్నూలు పోలీస్​ వెబ్​సైట్​కి వెళ్లి వివరాలు నమోదు చేస్తే.. సాధ్యమైనంత వరకు మొబైల్​ ఫోన్లను పట్టుకుని మీకు ఇస్తాము. ఆంధ్రప్రదేశ్​లో ఉన్నావారు ఎవరైనా సరే వివరాలు వివరాలు నమోదు చేసుకోవచ్చు. ఈ కార్యక్రమానికి మంచి ప్రోత్సాహం వస్తే ఇంకా ముందుకు కొనసాగిస్తాము."-సిద్ధార్థ కౌశల్ ,ఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.