పత్రికా స్వేచ్ఛను హరించే (2430) జీవోను వెంటనే రద్దు చేయాలని... జర్నలిస్టులు పలుచోట్ల ఆందోళనలు చేశారు. అనంతపురం ప్రస్క్లబ్లో మాజీమంత్రి కాల్వ శ్రీనివాసులు జర్నలిస్టు సంఘాల ప్రతినిధులతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. స్వార్ధంతోనే ముఖ్యమంత్రి ఈ జీవోను తెచ్చారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆనాడు వైఎస్ రాజశేఖరరెడ్డి ఈ తరహాలోనే చేస్తే... జర్నలిస్టు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన చేసిన విషయం గుర్తుచేశారు.
పత్రికా స్వేచ్ఛను హరించేలా ప్రభుత్వం తీసుకొచ్చిన 2430 జీవోని ఉపసంహరించుకోవాలని... ఏపీ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా ఒంగోలులో ధర్నా నిర్వహించారు. ప్రశ్నించే హక్కును కాలరాసేలా ఉన్న జీవోని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. మీడియాపై ఆంక్షలు ప్రజాస్వామ్య మనుగడకు ప్రమాదకరమని జర్నలిస్ట్ సంఘాల నేతలు పేర్కొన్నారు.
మీడియా స్వేచ్ఛకు భంగం కలిగించేలా ఉన్న జీవోను వెంటనే రద్దు చేయాలని సీపీఐ, ఏఐఎస్ఎఫ్ నేతలు డిమాండ్ చేశారు. కర్నూలు జిల్లా నంద్యాల పద్మావతినగర్ సర్కిల్ వద్ద జరిగిన ధర్నాలో జీవో పత్రాలు కాల్చివేశారు.
ఇదీ చూడండి... దిల్లీలో పోలీసులకు లాయర్లకు మధ్య ఘర్షణ