ETV Bharat / state

వైద్యులు దేవుళ్లతో సమానం: గవర్నర్

author img

By

Published : Dec 23, 2019, 7:01 AM IST

దేవుడిలా భావించే వైద్యులు... పేదల సేవలలో నిమగ్నం కావాలని గవర్నర్‌ బిశ్వభూషణ్ హరిచందన్ పిలుపునిచ్చారు. అణువణువూ సేవాభావాన్ని అలవరచుకోవాలని సూచించారు. కర్నూలు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో గవర్నర్‌ పాల్గొన్నారు.

governor tour in kurnool district
వైద్యులు దేవుళ్లతో సమానం: గవర్నర్
వైద్యులు దేవుళ్లతో సమానం: గవర్నర్

కర్నూలు జిల్లాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటించారు. కర్నూలు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరం ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు... ఇప్పుడు పెద్దపెద్ద వైద్యులుగా ఎదిగారని ప్రశంసించారు.

దేశ, విదేశాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజం పట్ల వైద్యుల బాధ్యతను గుర్తుచేశారు. లక్ష్మణుడిని బతికించడానికి సంజీవిని రహస్యం చెప్పిన వైద్యుడు విభీషణుడు అంటూ... రామాయణ గాథను ఉటంకించారు. వైద్యులు దేవుళ్లతో సమానమన్న గవర్నర్‌... పేదలకు సేవ చేసేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

కర్నూలు వైద్య కళాశాల ఎంతో మంది గొప్ప వైద్యులను అందించిందని గవర్నర్ పేర్కొన్నారు. అంకాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నోరి దత్తాత్రేయుడు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ప్రపంచస్థాయి నిపుణుడు డి.నాగేశ్వరరెడ్డి సహా మరెంతో మంది వైద్యులు... రోగులకు నిబద్ధతతో సేవ చేస్తున్నారని కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ వైద్యవృత్తిని ప్రేమించేవారన్న గవర్నర్... పేదలకు సేవ చేసేందుకు వైద్యుడు కావాలనుకున్నారు.

వైద్యకళాశాల కార్యక్రమం తర్వాత... కర్నూలు సమీపంలోని గాయత్రి గోశాలను గవర్నర్ సందర్శించారు. గోవులకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో తొలుత శ్రీశైలం మల్లన్నను గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. మల్లికార్జునుడు, భ్రమరాంభికాదేవికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ట్రైబల్‌ మ్యూజియంలో నల్లమల చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. గిరిజనులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండీ...

కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

వైద్యులు దేవుళ్లతో సమానం: గవర్నర్

కర్నూలు జిల్లాలో గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ పర్యటించారు. కర్నూలు వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి హాజరయ్యారు. కళాశాలలో ఏర్పాటు చేసిన అబ్దుల్‌కలాం విగ్రహాన్ని ఆవిష్కరించారు. రెడ్‌క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలోని రక్తదాన శిబిరం ప్రారంభించారు. కళాశాల ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కళాశాలలో చదువుకున్న విద్యార్థులు... ఇప్పుడు పెద్దపెద్ద వైద్యులుగా ఎదిగారని ప్రశంసించారు.

దేశ, విదేశాల్లో ఎనలేని సేవలు అందిస్తున్నారని కొనియాడారు. సమాజం పట్ల వైద్యుల బాధ్యతను గుర్తుచేశారు. లక్ష్మణుడిని బతికించడానికి సంజీవిని రహస్యం చెప్పిన వైద్యుడు విభీషణుడు అంటూ... రామాయణ గాథను ఉటంకించారు. వైద్యులు దేవుళ్లతో సమానమన్న గవర్నర్‌... పేదలకు సేవ చేసేందుకు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు.

కర్నూలు వైద్య కళాశాల ఎంతో మంది గొప్ప వైద్యులను అందించిందని గవర్నర్ పేర్కొన్నారు. అంకాలజీలో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన నోరి దత్తాత్రేయుడు, గ్యాస్ట్రో ఎంటరాలజీలో ప్రపంచస్థాయి నిపుణుడు డి.నాగేశ్వరరెడ్డి సహా మరెంతో మంది వైద్యులు... రోగులకు నిబద్ధతతో సేవ చేస్తున్నారని కొనియాడారు. జాతిపిత మహాత్మాగాంధీ వైద్యవృత్తిని ప్రేమించేవారన్న గవర్నర్... పేదలకు సేవ చేసేందుకు వైద్యుడు కావాలనుకున్నారు.

వైద్యకళాశాల కార్యక్రమం తర్వాత... కర్నూలు సమీపంలోని గాయత్రి గోశాలను గవర్నర్ సందర్శించారు. గోవులకు పూజ చేశారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్‌, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు. కర్నూలు జిల్లా పర్యటనలో తొలుత శ్రీశైలం మల్లన్నను గవర్నర్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఘనస్వాగతం పలికారు. మల్లికార్జునుడు, భ్రమరాంభికాదేవికి గవర్నర్‌ ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత ట్రైబల్‌ మ్యూజియంలో నల్లమల చెంచులతో ముఖాముఖి నిర్వహించారు. గిరిజనులకు వ్యవసాయ పరికరాలు పంపిణీ చేశారు.

ఇదీ చదవండీ...

కడప జిల్లాకు సీఎం... ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన

sample description
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.