పట్టాదారు పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఎమ్మార్వో వేధిస్తున్నాడని ఆరోపిస్తూ.. కర్నూలు జిల్లా కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట బాధితులు పెట్రోల్,పురుగులమందు డబ్బాతో నిరసనకు దిగారు. తమకు న్యాయం జరగపోతే అక్కడే ఆత్మహత్యకు పాల్పడుతామని హెచ్చరించారు. మండలంలోని లక్ష్మీపురం గ్రామానికి చెందిన ఇద్దరు బాధితులు తమ ఐదెకరాల పొలానికి సంబంధించి పాసు పుస్తకాలు ఇవ్వకుండా ఒక సంవత్సరం నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు వారివద్దనుంచి పెట్రోల్,పురుగుల మందు డబ్బాలను స్వాధీనం చేసుకున్నారు. తమ సమస్య పరిష్కారం అయ్యే వరకు నిరసన చేపడుతామని సదరు బాధితులు స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: