ETV Bharat / state

కుటుంబాలను కబళిస్తున్న కరోనా

author img

By

Published : May 6, 2021, 10:48 AM IST

మొదటి అల(వేవ్‌)లో కుటుంబంలో ఒకరు లేదా ఇద్దరికి కరోనా సోకింది. ప్రస్తుతం రెండో అలలో మాత్రం వైరస్‌ ప్రభావం తీవ్రంగా ఉండటంతో చిన్నా, పెద్దా తేడా లేకుండా కుటుంబం మొత్తం కరోనా బారిన పడుతున్నారు. ప్రధానంగా ఉమ్మడి(పెద్ద) కుటుంబాలను ఊచ కోత కోస్తోంది. వైరస్‌ ఒకరి ద్వారా దరిచేరి కుటుంబం మొత్తాన్ని చుట్టేస్తోంది. అందరూ అస్వస్థతకు గురవ్వడంతో ఆసుపత్రికి దగ్గరుండి తీసుకెళ్లే నాథులు కరవయ్యారు. బంధువుల సాయం అడుగుదామంటే... కరోనా అంటేనే హడలిపోతున్నారు. చేసేది లేక తెలిసిన వైద్యులతో చరవాణిలో సంప్రదించి స్వీయ గృహ నిర్బంధంలోనే ఆ కుటుంబాలు మందులు వాడుతున్నాయి. ఈ సమయంలో కొందరికి ఆక్సిజన్‌ స్థాయులు తగ్గడంతో ఆస్పత్రులకు పరుగులు పెడుతున్నారు. అప్పటికప్పుడు అత్యవసర వైద్యం అందక పలువురు ప్రాణాలు కోల్పోతున్నారు. 

corona effect
corona effect

* కర్నూలు నగరంలోని ఓ కుటుంబం ఉమ్మడిగా ఉంటోంది. గత నెల ఆ కుటుంబంలో అందరికి కరోనా లక్షణాలు కనిపించగా, సీటీ స్కాన్‌ పరీక్షలు చేయించారు. ఎనిమిది మందికి ఒకేసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 50 ఏళ్లు పైబడిన వారున్నారు. ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒకరు తీసుకెళ్లే వీల్లేక, తెలిసిన వైద్యుల సూచనతో ఇంట్లోనే మందులు వాడుతూ చికిత్స తీసుకున్నారు. ఈలోగా ఇద్దరికి అర్ధరాత్రి ఆక్సిజన్‌ శాతం తగ్గింది. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కగా అతి కష్టంపై పడకలు కేటాయించారు. వెంటిలేటర్లపై ఉంచి చికిత్స చేస్తుండగా ఒకరు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

* ఆదోనిలో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులకు కరోనా సోకింది. అందరూ వైరస్‌ బారిన పడటం, లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హెడ్‌ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ ఈ నెల 3న మృతి చెందారు. ఆయన భార్య సైతం కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

కొత్త వైరస్‌ తీవ్రతరంగా...

ప్రస్తుతం కరోనా రెండో అల జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం నెల రోజుల వ్యవధిలో 27,322 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మహమ్మారితో జిల్లాలో నెల రోజుల్లో 79 మరణాలు చోటు చేసుకున్నాయి. నమోదవుతున్న కేసుల్లో 5% నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపుతున్నారు. రెండో దఫా వైరస్‌లో యూకే, సౌత్‌ఆఫ్రికా వేరియంట్‌(డబుల్‌ మ్యూటెంట్‌) కనిపిస్తోందని, దీని విస్తరణ వేగంగా ఉండటంతోపాటు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రామాంజనేయులు ‘ఈనాడు’తో తెలిపారు.

ఇలా మొదలై... అలా ముగుస్తోంది

కుటుంబంలో లక్షణాలు కనిపించాక అందరూ ఒకేచోట ఉంటున్నారు. అందరికీ కరోనా వచ్చింది కదా? అన్నట్లు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించక పోవడం, శానిటైజేషన్‌ చేయకపోవడంతో వైరస్‌ తీవ్రత బలపడుతోంది. పల్స్‌ ఆక్సీమీటరుతో ఆక్సిజన్‌ స్థాయి పరిశీలించుకోక పోవడం వల్ల అత్యవసరం ఏర్పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు పడకలు ఖాళీ లేవంటూ డిమాండ్‌ పెంచేస్తున్నారు. వైరస్‌తో అప్పటికే దెబ్బతిన్న ఊపిరితిత్తులతో మృత్యువాత పడుతున్నారు.

ఆసుపత్రి అవసరం ఎవరికంటే?

కొవిడ్‌ లక్షణాల్లో జలుబు, జ్వరం, తుమ్ములు, గొంతు రాపిడి, నీరసం, ఒళ్లు నొప్పులు సాధారణం. గుండె దడ, దగ్గు, ఆయాసం ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోవాలి. ర్యాపిడ్‌లో 50%, ఆర్టీపీసీఆర్‌లో 70% పాజిటివ్‌ తెలుస్తుంది. అంటే 30% కొవిడ్‌ ఉన్నా నెగిటివ్‌ రావచ్చు. ఎందుకంటే పరీక్ష చేసే సమయం 4-7 రోజుల్లో అయితే పాజిటివ్‌ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్‌ స్థాయి 93% కన్నా తగ్గిన వారే ఆసుపత్రిలో చేరాల్సి ఉంది.

ఖాళీల్లేవనే సమాధానమే!

జిల్లాలో సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, నంద్యాల, ఆదోని ఏరియా ఆసుపత్రులతోపాటు విశ్వభారతి, శాంతిరామ్‌ వైద్య కళాశాలల్లో కొవిడ్‌ రోగులకు చికిత్సలందిస్తున్నారు. జిల్లాలో 23 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సలందించడానికి అనుమతులిచ్చారు. పడకలు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆక్సిజన్‌ బెడ్‌ నుంచి వెంటిలేటర్‌ పైకి మార్చాలంటే ఖాళీల్లేవనే సమాధానమే వస్తోంది.

బులెటిన్‌
* జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,985
* వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారు 12,997
* జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 86,447
* కరోనా నుంచి కోలుకున్న వారు 72,877
* కొవిడ్‌తో చనిపోయిన వారు 573

ఇదీ చదవండి: కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

* కర్నూలు నగరంలోని ఓ కుటుంబం ఉమ్మడిగా ఉంటోంది. గత నెల ఆ కుటుంబంలో అందరికి కరోనా లక్షణాలు కనిపించగా, సీటీ స్కాన్‌ పరీక్షలు చేయించారు. ఎనిమిది మందికి ఒకేసారి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. ఇందులో 50 ఏళ్లు పైబడిన వారున్నారు. ఆసుపత్రికి ప్రత్యేకంగా ఒకరు తీసుకెళ్లే వీల్లేక, తెలిసిన వైద్యుల సూచనతో ఇంట్లోనే మందులు వాడుతూ చికిత్స తీసుకున్నారు. ఈలోగా ఇద్దరికి అర్ధరాత్రి ఆక్సిజన్‌ శాతం తగ్గింది. ఆ సమయంలో ప్రైవేటు ఆసుపత్రుల గడప తొక్కగా అతి కష్టంపై పడకలు కేటాయించారు. వెంటిలేటర్లపై ఉంచి చికిత్స చేస్తుండగా ఒకరు మృత్యువాత పడ్డారు. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది.

* ఆదోనిలో ఒకే కుటుంబంలోని నలుగురు సభ్యులకు కరోనా సోకింది. అందరూ వైరస్‌ బారిన పడటం, లక్షణాలు ఎక్కువగా ఉండటంతో హెడ్‌ కానిస్టేబుల్‌ చికిత్స పొందుతూ ఈ నెల 3న మృతి చెందారు. ఆయన భార్య సైతం కర్నూలు సర్వజన వైద్యశాలలో చికిత్స పొందుతూ బుధవారం తెల్లవారుజామున కన్నుమూశారు. ఇద్దరు కుమారులు ప్రస్తుతం హోం క్వారంటైన్‌లో చికిత్స పొందుతున్నారు.

కొత్త వైరస్‌ తీవ్రతరంగా...

ప్రస్తుతం కరోనా రెండో అల జిల్లాలో వేగంగా విస్తరిస్తోంది. ఏప్రిల్‌ నుంచి ఇప్పటి వరకు కేవలం నెల రోజుల వ్యవధిలో 27,322 కేసులు నమోదయ్యాయంటే తీవ్రత అర్థం చేసుకోవచ్చు. మహమ్మారితో జిల్లాలో నెల రోజుల్లో 79 మరణాలు చోటు చేసుకున్నాయి. నమోదవుతున్న కేసుల్లో 5% నమూనాలను సేకరించి హైదరాబాద్‌లోని సీసీఎంబీ ల్యాబ్‌కు పంపుతున్నారు. రెండో దఫా వైరస్‌లో యూకే, సౌత్‌ఆఫ్రికా వేరియంట్‌(డబుల్‌ మ్యూటెంట్‌) కనిపిస్తోందని, దీని విస్తరణ వేగంగా ఉండటంతోపాటు, వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉండి మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయని జిల్లా సర్వేలెన్స్‌ అధికారి డాక్టర్‌ రామాంజనేయులు ‘ఈనాడు’తో తెలిపారు.

ఇలా మొదలై... అలా ముగుస్తోంది

కుటుంబంలో లక్షణాలు కనిపించాక అందరూ ఒకేచోట ఉంటున్నారు. అందరికీ కరోనా వచ్చింది కదా? అన్నట్లు సామాజిక దూరం పాటించకపోవడం, మాస్కులు ధరించక పోవడం, శానిటైజేషన్‌ చేయకపోవడంతో వైరస్‌ తీవ్రత బలపడుతోంది. పల్స్‌ ఆక్సీమీటరుతో ఆక్సిజన్‌ స్థాయి పరిశీలించుకోక పోవడం వల్ల అత్యవసరం ఏర్పడుతోంది. ప్రైవేటు ఆసుపత్రులు పడకలు ఖాళీ లేవంటూ డిమాండ్‌ పెంచేస్తున్నారు. వైరస్‌తో అప్పటికే దెబ్బతిన్న ఊపిరితిత్తులతో మృత్యువాత పడుతున్నారు.

ఆసుపత్రి అవసరం ఎవరికంటే?

కొవిడ్‌ లక్షణాల్లో జలుబు, జ్వరం, తుమ్ములు, గొంతు రాపిడి, నీరసం, ఒళ్లు నొప్పులు సాధారణం. గుండె దడ, దగ్గు, ఆయాసం ముఖ్య లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే ఆర్టీపీసీఆర్, ర్యాపిడ్‌ యాంటీజెన్‌ పరీక్షలు చేయించుకోవాలి. ర్యాపిడ్‌లో 50%, ఆర్టీపీసీఆర్‌లో 70% పాజిటివ్‌ తెలుస్తుంది. అంటే 30% కొవిడ్‌ ఉన్నా నెగిటివ్‌ రావచ్చు. ఎందుకంటే పరీక్ష చేసే సమయం 4-7 రోజుల్లో అయితే పాజిటివ్‌ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆక్సిజన్‌ స్థాయి 93% కన్నా తగ్గిన వారే ఆసుపత్రిలో చేరాల్సి ఉంది.

ఖాళీల్లేవనే సమాధానమే!

జిల్లాలో సర్వజన వైద్యశాల, నంద్యాల జిల్లా ఆసుపత్రి, నంద్యాల, ఆదోని ఏరియా ఆసుపత్రులతోపాటు విశ్వభారతి, శాంతిరామ్‌ వైద్య కళాశాలల్లో కొవిడ్‌ రోగులకు చికిత్సలందిస్తున్నారు. జిల్లాలో 23 ప్రైవేటు ఆసుపత్రులకు కరోనా చికిత్సలందించడానికి అనుమతులిచ్చారు. పడకలు ఇబ్బంది లేదని అధికారులు చెబుతున్నా క్షేత్రస్థాయిలో ఆక్సిజన్‌ బెడ్‌ నుంచి వెంటిలేటర్‌ పైకి మార్చాలంటే ఖాళీల్లేవనే సమాధానమే వస్తోంది.

బులెటిన్‌
* జిల్లా వ్యాప్తంగా నమోదైన కేసుల సంఖ్య 1,985
* వివిధ ఆసుపత్రుల్లో చికిత్సలు పొందుతున్న వారు 12,997
* జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 86,447
* కరోనా నుంచి కోలుకున్న వారు 72,877
* కొవిడ్‌తో చనిపోయిన వారు 573

ఇదీ చదవండి: కరోనా విలయం.. మరోసారి 4 లక్షలకు పైగా కేసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.