ETV Bharat / state

కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని

కర్నూలు జిల్లాలో డిగ్రీ విద్యార్థిని కార్పొరేటర్‌గా ఎన్నికయ్యారు.35వ వార్డులో మాధురి అనే యువతి ఏకగ్రీవం అయ్యారు. 21 ఏళ్లకే ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కించుకున్నారు.

author img

By

Published : Mar 4, 2021, 9:54 AM IST

degree student
degree student
కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని

డిగ్రీ విద్యార్థిని కార్పొరేటర్‌గా ఎన్నికైన అరుదైన ఘటన.. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో చోటుచేసుకొంది. నగరంలోని 34, 35 వార్డుల్లో ఇతర పార్టీల వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నందున వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

34వ వార్డులో ఎరుకల వెంకటేశ్వర్లు.. 35వ వార్డులో మాధురి అనే యువతి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధురి.. 21 సంవత్సరాల వయసుకే ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కించుకొంది.

ఇదీ చదవండి:

నేడు, రేపు చిత్తూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన

కార్పొరేటర్‌గా ఎన్నికైన 21 ఏళ్ల డిగ్రీ విద్యార్థిని

డిగ్రీ విద్యార్థిని కార్పొరేటర్‌గా ఎన్నికైన అరుదైన ఘటన.. కర్నూలు నగరపాలక సంస్థ ఎన్నికల్లో చోటుచేసుకొంది. నగరంలోని 34, 35 వార్డుల్లో ఇతర పార్టీల వారు నామినేషన్లు ఉపసంహరించుకున్నందున వైకాపా అభ్యర్థులు ఏకగ్రీవం అయ్యారు.

34వ వార్డులో ఎరుకల వెంకటేశ్వర్లు.. 35వ వార్డులో మాధురి అనే యువతి గెలుపొందినట్లు రిటర్నింగ్ అధికారి డిక్లరేషన్ పత్రాలు అందజేశారు. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న మాధురి.. 21 సంవత్సరాల వయసుకే ప్రజా సమస్యలు పరిష్కరించే అవకాశం దక్కించుకొంది.

ఇదీ చదవండి:

నేడు, రేపు చిత్తూరు జిల్లాలో ఉపరాష్ట్రపతి పర్యటన

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.