కర్నూలు జిల్లా కోడుమూరు మార్గంలోని విశ్వభారతి కోవిడ్ హాస్పిటల్ వద్ద కరోనా బాధితులు ఆందోళనకు దిగారు. వైద్య సదుపాయాలు అందటం లేదని, కనీస సౌకర్యాలు లేవని నిరసన చేపట్టారు. వైద్యులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. బళ్లారి రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. గంట పాటు ట్రాఫిక్ స్తంభించింది. పోలీసులు నచ్చ చెప్పటంతో ఆందోళన విరమించారు.

ఇదీ చదవండి: ఆర్థిక స్వావలంబన లేక మహిళలు పడుతున్న ఇబ్బందులు చూశా: సీఎం