కర్నూలు జిల్లా తమరాజుపల్లె గ్రామ సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న లారీని వోల్వోబస్సు ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా, పదిమందికి గాయాలయ్యాయి. తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళ్తున్న వోల్వో బస్సు ముందు వెళ్తున్న లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు. క్షతగాత్రులను నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇది చదవండి: polavaram: ఎటు చూసినా మొండి స్తంభాలు.. నిర్వాసితుల ఇక్కట్లు!