ETV Bharat / state

కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా భారత్​ బంద్​

author img

By

Published : Mar 26, 2021, 12:13 PM IST

కర్నూలు జిల్లాలో భారత్​ బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా.. పట్టిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నారు. చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు.

bharath bhandh in kurnool district
కర్నూలు జిల్లాలో ప్రశాంతంగా భారత్​ బంద్​

కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారత్​బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.

నంద్యాల..

బంద్​లో భాగంగా ఈ ప్రాంతంలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రైవేటీకరణ, వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఆదోని...

సాగుచట్టాలు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన భారత్​బంద్ ఈ ప్రాంతంలో ​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. పాఠశాలలకు ముందస్తుగానే సెలవు ప్రకటించారు.

ఇదీ చదవండీ.. పాఠశాలలో మద్యం సేవించిన ఉపాధ్యాయుడు... సస్పెండ్ చేసిన ఎంఈవో

కర్నూలు జిల్లా వ్యాప్తంగా భారత్​బంద్​ ప్రశాంతంగా కొనసాగుతోంది. దుకాణాలు, వ్యాపార సముదాయాలు స్వచ్ఛందంగా బంద్​ పాటిస్తున్నారు. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి.

నంద్యాల..

బంద్​లో భాగంగా ఈ ప్రాంతంలో వామపక్ష పార్టీల నాయకులు ధర్నా నిర్వహించారు. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నిత్యావసర వస్తువుల ధరలు, ప్రైవేటీకరణ, వ్యవసాయ చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని నాయకులు డిమాండ్ చేశారు.

ఆదోని...

సాగుచట్టాలు వ్యతిరేకంగా, ప్రైవేటీకరణ నిరసిస్తూ చేపట్టిన భారత్​బంద్ ఈ ప్రాంతంలో ​ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోకు పరిమితమయ్యాయి. పాఠశాలలకు ముందస్తుగానే సెలవు ప్రకటించారు.

ఇదీ చదవండీ.. పాఠశాలలో మద్యం సేవించిన ఉపాధ్యాయుడు... సస్పెండ్ చేసిన ఎంఈవో

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.