కరోనా కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై ఎమ్మెల్యే హాఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో.. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. హాస్పిటల్స్లో ఆక్సిజన్, బెడ్స్ కొరత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో రుసుములు, వాక్సినేషన్ వంటి విషయాలపై చర్చించారు. ప్రజలు పడుతున్న ఇబ్బందుల గురించి ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. ఈ చర్చలో అన్ని పార్టీల ముఖ్య నేతలు పాల్గొన్నారు. వారి సలహాలు, సూచనలు అందించారు.
కరోనాపై ప్రజలకు అవగహన కల్పించడం వల్ల వైరస్ నియంత్రణ చేయవచ్చని ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ అన్నారు. అంతగా లక్షణాలు కనిపించకున్నా.. వైరస్ పాజిటివ్ వచ్చిన వారు ఇంటి వద్దే చికిత్స తీసుకోవాలని ఆయన సూచించారు. లక్షణాలు ఎక్కువగా ఉంటేనే ఆసుపత్రులకు వెళ్లాలని తెలిపారు. కర్నూలులో కొత్త వైరస్పై అసత్య ప్రచారం జరుగుతోందని.. దానిపై ప్రజలు ఆందోళన పడాల్సిన అవసరం లేదని చెప్పారు.
ఇదీ చదవండి:
రాష్ట్రానికి 'వైఎస్ వైరస్' పట్టింది.. అది 'నారా వ్యాక్సిన్' తోనే పోతుంది..!