కర్నూలు జిల్లా శ్రీశైలం దేవస్థానంలో జరిగిన అవినీతి అక్రమాలపై అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేపట్టారు. నిందితులను ఉదయం నుంచి శ్రీశైలం పోలీస్ స్టేషన్లో ఏసీబీ అధికారులు విచారించారు. టిక్కెట్ల కుంభకోణంపై నిందితుల నుంచి వివరాలు నమోదు చేసుకున్నారు. అప్పటి సిస్టం అడ్మిన్ను కూడా ఏసీబీ అధికారులు విచారించారు.
సాయంత్రం అనిశా జాయింట్ డైరెక్టర్ తన బృందంతో దేవస్థానం పరిపాలన భవనానికి చేరుకున్నారు. దేవస్థానంలో రికార్డులను అధికారులు తనిఖీలు చేశారు. శుక్రవారం కూడా అనిశా అధికారులు విచారణ చేయనున్నట్లు తెలిసింది.