ETV Bharat / state

మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం

author img

By

Published : Oct 28, 2020, 4:49 AM IST

పేగుతెంచుకుని పుట్టిన వాళ్లు పట్టనట్లు వదిలేశారు. అయినవాళ్లెవరూ ఆ దరిదాపులకు రావడం మానేశారు. ఒంటరిగా కాలం వెళ్లదీస్తున్న ఆ వృద్ధురాలిని... ఓ ప్రమాదం అచేతనంగా మార్చేసింది. అందరూ ఉన్న అనాథగా మారిన ఆమెకు.. ఓ మానవతామూర్తి ఆపద్భాందవుడయ్యాడు. రక్త సంబంధం లేకపోయినా ఆదరాభిమానాలు చాటుతున్నాడు.

మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం
మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం
మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన సుంకులమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. చిన్న కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆస్తి పంచివ్వలేదని పెద్దకుమారుడు, కుమార్తె సుంకులమ్మతో మాట్లాడటం కూడా మానేశారు. అందరూ ఉన్న అనాథలా మిగిలిన సుంకులమ్మ... పొరుగూరు బ్రాహ్మణపల్లిలో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ పొట్ట పోసుకునేది. ఓ రోజు బస్సు దిగి వస్తూ కిందపడి కాలు విరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న బాలరాజు ఆమెకు వైద్యం చేయించి కాలుకు కట్టు కట్టించారు.

వృద్ధురాలి కుటుంబీకులకు బాలరాజు ఫోన్‌ చేసి.... జరిగిన విషయం చెప్పాడు. వాళ్లెవరరూ స్పందించకపోగా ఇంకెప్పుడూ ఫోన్‌ చేయొద్దని తెగేసి చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని బాలరాజు ఇక సుంకులమ్మ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. బస్‌షెల్టర్‌లోనే ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సమయానికి భోజనం, మందులు అందిస్తూ.. అండగా ఉంటున్నారు.

బాలరాజు సేవను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. సుంకులమ్మను సంరక్షిస్తున్న బాలరాజుకు స్థానిక నేతలు ఖర్చుల కోసం డబ్బు సాయం చేస్తున్నారు.

ఇదీ చదవండి : నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

మానవత్వమే బంధం...వృద్ధురాలికి సాయం

కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం కాల్వ గ్రామానికి చెందిన సుంకులమ్మకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె. చిన్న కుమారుడు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆస్తి పంచివ్వలేదని పెద్దకుమారుడు, కుమార్తె సుంకులమ్మతో మాట్లాడటం కూడా మానేశారు. అందరూ ఉన్న అనాథలా మిగిలిన సుంకులమ్మ... పొరుగూరు బ్రాహ్మణపల్లిలో కూరగాయలు, పండ్లు అమ్ముకుంటూ పొట్ట పోసుకునేది. ఓ రోజు బస్సు దిగి వస్తూ కిందపడి కాలు విరిగింది. ఆ మార్గంలో వెళ్తున్న బాలరాజు ఆమెకు వైద్యం చేయించి కాలుకు కట్టు కట్టించారు.

వృద్ధురాలి కుటుంబీకులకు బాలరాజు ఫోన్‌ చేసి.... జరిగిన విషయం చెప్పాడు. వాళ్లెవరరూ స్పందించకపోగా ఇంకెప్పుడూ ఫోన్‌ చేయొద్దని తెగేసి చెప్పేశారు. ఏం చేయాలో పాలుపోని బాలరాజు ఇక సుంకులమ్మ సంరక్షణ బాధ్యతలు తీసుకున్నారు. బస్‌షెల్టర్‌లోనే ఆమె ఉండేందుకు ఏర్పాట్లు చేశారు. సమయానికి భోజనం, మందులు అందిస్తూ.. అండగా ఉంటున్నారు.

బాలరాజు సేవను గ్రామస్తులు మెచ్చుకుంటున్నారు. సుంకులమ్మను సంరక్షిస్తున్న బాలరాజుకు స్థానిక నేతలు ఖర్చుల కోసం డబ్బు సాయం చేస్తున్నారు.

ఇదీ చదవండి : నవంబర్ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.