కృష్ణా జిల్లా మోపిదేవి మండలంలో 216 జాతీయ రహదారి వద్ద కాలువ పై ఉన్న వంతెన... గత నెలలో కూలిపోగా అధికారులు పక్కనే అప్రోచ్ రోడ్డు వేశారు. లోడ్ తో ఉన్న రెండు లారీలు ఈ రోడ్డు పై వెళ్లుతుండగా పక్కకు ఒరిగిపోయాయి. దీంతో ఆ మార్గం ద్వారా వాహనాలు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది. ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా.. అవనిగడ్డ నుంచి వెళ్లే వాహనాలను వెంకటాపురం మీదుగా చల్లపల్లి వరకు మళ్లించారు.
ఇదీ చదవండి: విశాఖలో తెదేపా కార్యాలయ కూల్చివేత చర్యలపై హైకోర్టు స్టే